మెగా పిక్: యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ ఫస్ట్ ఫొటో

ABN , First Publish Date - 2021-11-06T02:31:26+05:30 IST

దీపావళి సెలబ్రేషన్స్ మెగా ఫ్యామిలీలోనే కాదు మెగా అభిమానుల్లో కూడా ఎంతో ఆనందాన్ని నింపాయి. కారణం ఇటీవల యాక్సిడెంట్‌కు గురై.. కొన్ని రోజుల పాటు కోమాలో ఉండి కోలుకున్న సాయిధరమ్ పున:దర్శనం మెగాభిమానులకు

మెగా పిక్: యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ ఫస్ట్ ఫొటో

దీపావళి సెలబ్రేషన్స్ మెగా ఫ్యామిలీలోనే కాదు మెగా అభిమానుల్లో కూడా ఎంతో ఆనందాన్ని నింపాయి. కారణం ఇటీవల యాక్సిడెంట్‌కు గురై.. కొన్ని రోజుల పాటు కోమాలో ఉండి కోలుకున్న సాయిధరమ్ పున:దర్శనం మెగాభిమానులకు కలిగింది. దీపావళి సందర్భంగా మెగా హీరోలంతా ఒకచోట చేరి వేడుక చేసుకున్న ఫొటోను తాజాగా సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. యాక్సిడెంట్ తర్వాత ఎప్పుడెప్పుడు సాయితేజ్ కనిపిస్తాడా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిరంజీవి మెగా పిక్‌తో ఫుల్ ట్రీట్ ఇచ్చారు. ‘‘అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికి ఇది నిజమైన పండుగ..’’ అని మెగాస్టార్ ఈ మెగా పిక్‌ని షేర్ చేశారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-11-06T02:31:26+05:30 IST