హీరోతో ఫోజు ఇచ్చి సెహ్వాగ్‌ని టీజ్ చేసిన Sachin Tendulkar

ABN , First Publish Date - 2021-12-15T22:33:01+05:30 IST

భారత క్రికెట్లో వీరెందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారెవరు ఉండరు. క్రికెట్లో ఒపెనింగ్ అంటే ఈ జంటనే

హీరోతో ఫోజు ఇచ్చి సెహ్వాగ్‌ని టీజ్ చేసిన Sachin Tendulkar

భారత క్రికెట్లో వీరెందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారెవరు ఉండరు. క్రికెట్లో ఒపెనింగ్ అంటే ఈ జంటనే అందరికి గుర్తుకు వస్తుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఒకరిని మరొకరు ఆట పట్టిస్తుంటారు. ఇద్దరు క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికి ఆటపట్టించడం మాత్రం మానలేదు. 


అలనాటి హీరో ధర్మేంద్ర, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మంగళవారం ప్లైట్‌లో కలసుకున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో ఇద్దరు పోస్ట్ చేశారు. ధర్మేంద్ర ట్విట్టర్‌లో ఆ ఫొటోలను పోస్ట్ చేశారు. ‘‘ దేశం గర్వించే వ్యక్తి సచిన్ టెండూల్కర్‌ను నేడు ప్లైట్‌లో కలసుకున్నాను. ఎప్పుడు అతడిని కలిసినా సొంత కొడుకుడిని కలిసినట్టే ఉంటుంది ’’ అని హీరో కామెంట్ చేశారు. సచిన్ టెండూల్కర్ అదే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘ నేడు అతిపెద్ద వీరును కలుసుకున్నాను. అతడెవరో కాదు హీరో ధర్మేంద్ర. అందరి వీరుల కంటె కూడా అతడు కొంచెం కొత్తవాడు. ప్రతి ఒక్కరు అతడికి అభిమానిగా ఉంటారు ’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో సచిన్ కామెంట్ చేశాడు. అనంతరం వీరెందర్ సెహ్వాగ్‌కు ట్యాగ్ చేస్తు పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌కు రణ్ వీర్ సింగ్ కూడా స్పందించాడు.



Updated Date - 2021-12-15T22:33:01+05:30 IST