నెలకు రూ. 8 లక్షలు భరణం ఇవ్వాల్సిందే

ABN , First Publish Date - 2022-10-02T07:07:48+05:30 IST

నటుడు, మాజీ వైకాపా నాయకుడు పృథ్వీరాజ్‌కు భార్య భరణం కేసులో న్యాయస్థానం తీర్పు వ్యతిరేకంగా వచ్చింది...

నెలకు రూ. 8 లక్షలు భరణం ఇవ్వాల్సిందే

నటుడు, మాజీ వైకాపా నాయకుడు పృథ్వీరాజ్‌కు భార్య భరణం కేసులో న్యాయస్థానం తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. ప్రతినెలా పృథ్వీ తన భార్య శ్రీలక్ష్మికి రూ. 8 లక్షల భరణం చెల్లించాలని శనివారం విజయవాడ 14వ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. కేసు దాఖలైనప్పటి నుంచీ, ఇప్పటి వరకూ ఎరియర్స్‌ కూడా చెల్లించాలని పేర్కొన్నారు. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో పృథ్వీకి 1984లో వివాహమైంది. వారికి ఒక కుమార్తె, కొడుకు ఉన్నారు. తన భర్త వేధిస్తున్నాడంటూ శ్రీలక్ష్మి గృహహింస చట్టం కింద కేసు పెట్టారు. 2017లో భర్త నుంచి భరణం కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

Updated Date - 2022-10-02T07:07:48+05:30 IST