‘కేజీఎఫ్-2’ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా.. ఆ క్లబ్‌లోకి చేరిన ‘ఆర్‌ఆర్‌ఆర్’..

ABN , First Publish Date - 2022-04-17T23:12:28+05:30 IST

దర్శక ధీరుడు రాజమౌళి తెరెకెక్కించిన సినిమా ‘రౌద్రం, రణం, రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు.

‘కేజీఎఫ్-2’ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా.. ఆ క్లబ్‌లోకి చేరిన ‘ఆర్‌ఆర్‌ఆర్’..

దర్శక ధీరుడు రాజమౌళి తెరెకెక్కించిన సినిమా ‘రౌద్రం, రణం, రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. హిందీ వెర్షన్ బాలీవుడ్‌లో రూ.250కోట్ల వసూళ్ల మార్కును దాటింది. ‘కేజీఎఫ్-2’ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ ‘ఆర్ఆర్‌ఆర్’ మూవీ కలెక్షన్లను కొల్లగొడుతునే ఉంది. ఓవర్సీస్‌లోను దాదాపుగా 14మిలియన్ల కలెక్షన్లను రాబట్టింది. 


భారత్‌లో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ రూ.250కోట్ల వసూళ్లను దాటిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రం రూ.250.09కోట్లను రాబట్టిందని తెలుస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ను రాజమౌళి ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కించాడు. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతరామరాజు, కొమురం భీంలను ఆధారంగా చేసుకుని రూపొందించాడు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌‌తో ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలో ఆలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, ఓలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ తదితరులు కీలక ప్రాతలు పోషించారు.



Updated Date - 2022-04-17T23:12:28+05:30 IST