‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ ప్రకటన వాయిదా.. కారణమిదే

ABN , First Publish Date - 2021-10-30T03:14:19+05:30 IST

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా.. భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). షూటింగ్ పూర్తి చేసుకుని

‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ ప్రకటన వాయిదా.. కారణమిదే

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా.. భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ని ఇస్తామని తెలిపిన టీమ్.. ఊహించని పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.


అయితే ఆ ఊహించని పరిస్థితులు ఏమిటనేది అందరికీ తెలిసిందే. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాత్ మరణంతో యావత్ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రకటన చేయడం భావ్యం కాదని భావిస్తూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రయూనిట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయానికి నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 



Updated Date - 2021-10-30T03:14:19+05:30 IST