Roja: మెగాస్టార్తో మంత్రి క్రేజీ సెల్ఫీ!
ABN , First Publish Date - 2022-07-05T01:55:50+05:30 IST
మెగాస్టార్ చిరంజీతో సెల్ఫీ తీసుకున్నారు ఏపీ మంత్రి రోజా. ఒకప్పుడు పలు చిత్రాలతో స్ర్కీన్ షేర్ చేసుకున్న వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతోత్సవాలు భీమవరంలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
మెగాస్టార్ చిరంజీవితో (Megastar chiranjeevi)సెల్ఫీ తీసుకున్నారు ఏపీ మంత్రి రోజా(Roja selvamani). ఒకప్పుడు పలు చిత్రాలతో స్ర్కీన్ షేర్ చేసుకున్న వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతోత్సవాలు భీమవరంలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, వైసీపీ నాయకులతోపాటు చిరంజీవి అతిథిగా హాజరయ్యారు. ప్రధాని ప్రసంగం అనంతరం వేదికపై ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రమంత్రిగా రోజా సెల్వమణి కూడా మోదీతో వేదిక పంచుకున్నారు. ప్రధానితో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఇదే వేదికపై చాలారోజుల తర్వాత కలిసిన తన హీరో చిరంజీవితో కూడా రోజా సెల్ఫీ తీసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘క్రేజీ ఫొటో ఆఫ్ ద డే’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (Roja selfie with chiranjeevi)
చిరంజీవి, రోజా కలిసి ‘ముఠామేస్త్రీ, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘బిగ్బాస్’ చిత్రాల్లో నటించారు. ‘ఇప్పుడు అవకాశం ఇచ్చినా చిరంజీవితో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నా’ అని రోజా ఇటీవల ఓ రియాలిటీ షోలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే!