సల్మాన్ సినిమాకు సంగీతం అందించనున్న దేవి శ్రీ ప్రసాద్..!
ABN , First Publish Date - 2022-04-17T21:28:06+05:30 IST
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. తన పుట్టిన రోజు సందర్భంగా వరుస సినిమాలను ప్రకటించాడు.
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. తన పుట్టిన రోజు సందర్భంగా వరుస సినిమాలను ప్రకటించాడు. ‘పవన్ పుత్ర భాయిజాన్’, ‘కబీ ఈద్, కబీ దివాళీ’ వంటి చిత్రాలను పట్టాలెక్కించనున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నటీ, నటులతో పాటు సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసే పనిలో నిర్మాతలు ఉన్నారు. సల్మాన్ నటించనున్న ఓ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఫర్హద్ సామ్జీ తెరకెక్కిస్తున్న సినిమా ‘కబీ ఈద్, కబీ దివాళీ’.. షూటింగ్ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే కొత్త ట్యూన్లను కంపోజ్ చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఒక్క సినిమాకు ఇద్దరు, ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. అదే ట్రెండ్ను అనుసరిస్తూ దేవీ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడట. ‘కబీ ఈద్, కబీ దివాళీ’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో యాక్షన్ కామెడీగా తెరకెక్కనున్నందట. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కానుంది. ఈ మూవీని సల్మాన్ ఖాన్ సొంత నిర్మాణసంస్థ ‘సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్’ నిర్మించనుంది. బాలీవుడ్ భాయ్జాన్ గతంలో నటించిన ‘రెడీ’ సినిమాలో ‘ఢింకచిక’ అనే పాటను దేవినే కంపోజ్ చేశాడు.