వసూళ్లు పెరుగుతున్నాయి

ABN , First Publish Date - 2022-09-27T06:10:07+05:30 IST

నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహించారు....

వసూళ్లు పెరుగుతున్నాయి

నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల నిర్మాత సంతోషం వ్యక్తం చేశారు. ‘‘కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. శుక్రవారం కంటే శనివారం వసూళ్లు బాగున్నాయి. ఆదివారం మరింత  పెరిగాయి. ఇలా రోజు రోజుకీ మౌత్‌ టాక్‌తో వసూళ్లు పెరగడం ఆనందంగా ఉంది. ‘ఛలో’ తరవాత మా బ్యానర్‌లో మంచి విజయం ఈ సినిమాతో దక్కింది. నాగశౌర్య నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా వెన్నెల కిశోర్‌, సత్య, రాహుల్‌ రవీంద్రన్‌ మధ్య తెరకెక్కించిన కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తున్నాయి. అమ్మ పాత్రలో రాధిక నటన హుందాగా ఉందని కాంప్లిమెంట్లు వచ్చాయి. మా బ్యానర్‌లో మరో కొత్త చిత్రాన్ని త్వరలో ప్రారంభిస్తామ’’న్నారు. 


Updated Date - 2022-09-27T06:10:07+05:30 IST