కూతురికి పేరు పెట్టేసిన ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు..? రెండు సంస్కృతులు కలిసేలా..
ABN , First Publish Date - 2022-04-21T15:10:01+05:30 IST
బాలీవుడ్లో అడుగుపెట్టి మొదటి సినిమా నుంచే అందంతోపాటు అభినయంతో అభిమానుల మనసు దోచిన నటి ప్రియాంక చోప్రా...
బాలీవుడ్లో అడుగుపెట్టి మొదటి సినిమా నుంచే అందంతోపాటు అభినయంతో అభిమానుల మనసు దోచిన నటి ప్రియాంక చోప్రా. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్గా ఎదిగింది. అనంతరం హాలీవుడ్కి వెళ్లిన ఈ భామ అక్కడ సైతం మంచి పాపులారిటీ సాధించింది. అయితే.. ఈ తార కొన్నేళ్ల క్రితం ప్రముఖ సింగర్, హాలీవుడ్ యాక్టర్ నిక్ జోనాస్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ జంటకి ఇటీవలే సరోగసి ద్వారా జనవరి 15న ఓ కూతురు పుట్టిన విషయం తెలిసిందే.
అయితే.. ఆ పాప పుట్టి ఇప్పటికే మూడు నెలలు దాటిపోయినా ఇంతవరకు ఈ జంట తమ కూతురికి ఏ పేరు పెట్టలేదు. తాజాగా ప్రియాంక, జోనాస్ కూతురికి పేరు నిర్ణయించేశారని, అది ఇదేనంటూ ఓ నేమ్ నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ కపుల్ తమ కూతురికి ఇటీవలే బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నారట. అందులో.. ఆ పాప పేరు మాలతి మేరీ చోప్రా జోనాస్ అని రాయించారట. అంతేకాకుండా ఆ సర్టిఫికెట్లో మాలతి, కాలిఫోర్నియాలోని శాండియాగోలో జనవరి 15న రాత్రి 8 గంటలకు పుట్టినట్లు ఉందట. ఆ పాప పేరులో తమ రెండు సంస్కృతులు కలిసేలా ఈ పేరుని డిసైడ్ చేశారని ప్రచారం సాగుతోంది. ఇందులో మాలతి అనే పేరు హిందువులకి సంబంధించింది కాగా.. మేరీ అనే పేరు క్రిస్టియానిటీకి సంబంధించినది. అయితే.. ప్రియాంకగానీ, జోనాస్గానీ ఈ రూమర్స్పై స్పందించలేదు. ఈ ప్రచారం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి మరి..