హలో అవార్డ్స్: పురస్కారాలు అందుకున్న రేఖ, కృతి సనన్, సిద్దార్థ్ మల్హోత్రా, అనన్య పాండే

ABN , First Publish Date - 2022-03-14T21:37:26+05:30 IST

‘హలో’ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ ముంబైలో ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి.

హలో అవార్డ్స్: పురస్కారాలు అందుకున్న రేఖ, కృతి సనన్, సిద్దార్థ్ మల్హోత్రా, అనన్య పాండే

‘హలో’ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ ముంబైలో ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు ఈ వేడుకలకు హాజరయ్యారు. కియారా అడ్వాణీ, తాప్సీ, సిద్దార్థ్ మల్హోత్రా, అనన్య పాండే, కృతి సనన్, అక్షయ్ కుమార్ ఈ ఫంక్షన్‌లో సందడి చేశారు. కృతి సనన్ లావెండర్ గౌను ధరించి అవార్డ్స్ ఫంక్షన్‌కి విచ్చేసింది. ఫొటోలకు ఫొజులిచ్చే సమయంలో కొంచెం ఇబ్బంది పడింది. ఆ సమయంలో ఆమె గౌనును పట్టుకుని సిద్దార్థ్ మల్హోత్రా తనకి సహాయం చేశాడు. దీంతో అతడిని ‘జెంటిల్ మేన్’ అని అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. కృతికి బెస్ట్ యాక్టర్ పాపులర్ ఛాయిస్ అవార్డ్ లభించింది.


‘భరత్ అనే నేను’లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన సుందరి కియారా అడ్వాణీ. ఆమె బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్ ఛాయిస్ అవార్డును అందుకుంది. ఔట్ స్టాండింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ను సిద్దార్థ్ మల్హోత్రా అందుకున్నాడు. మోస్ట్ ప్రామిసింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అనన్య పాండే కైవసం చేసుకుంది. సినిమాటిక్ లెజెండ్ అవార్డు రేఖకు లభించింది.

Updated Date - 2022-03-14T21:37:26+05:30 IST