Regina Cassandra: మగాళ్లు.. మ్యాగి రెండు నిమిషాలే.. కామెంట్ వైరల్!
ABN , First Publish Date - 2022-09-10T23:07:28+05:30 IST
మగాళ్లను మ్యాగితో పోల్చారు హీరోయిన్ రెజీనా కాసాండ్ర(Regina Cassandra). ‘శాకినీ డాకినీ’(Sakini dakini) సినిమా ప్రమోషన్లో మగాళ్లను ఉద్దేశించి ఆమె కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.
మగాళ్లను మ్యాగితో పోల్చారు హీరోయిన్ రెజీనా కాసాండ్ర(Regina Cassandra). ‘శాకినీ డాకినీ’(Sakini dakini) సినిమా ప్రమోషన్లో మగాళ్లను ఉద్దేశించి ఆమె కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. నోరు జారావు రెజీనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. రెజీనా తాజాగా నటించిన చిత్రం ‘శాకిని.. డాకిని’. నివేధా థామస్ మరో కథానాయిక. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో బిజీ అయిన రెజీనా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ యాంకర్తో మగాళ్లను ఉద్దేశించి ఓ కామెంట్ చేశారు. (Regina Cassandra Comments on boys)
‘అబ్బాయిల మీద నా దగ్గర పెద్ద జోక్ ఉంది. కానీ ఇక్కడ ఆ జోక్ వేయకూడదు’ అని రెజీనా యాంకర్తో అనగా.. సదరు యాంకర్ అబ్బాయిల మీద వద్దు నాపై చెప్పండి అనగానే రెజీనా ‘‘అబ్బాయిలు.. మ్యాగీ రెండూ రెండు నిమిషాల్లో అయిపోతుంది. మీకు అర్థం కావడం లేదు’ అనగానే యాంకర్ నాకు అర్థమైంది అనగానే ఇంకొద్దు అనగానే రెజీనా ఆ టాపిక్ ఆపేసింది. పక్కనే కూర్చుని తింటున్న నివేదా థామస్ ఆమె మాటల్ని అంతగా పట్టించుకోలేదు. ప్రస్తుతం రెజీనా కామెంట్ వైరల్ అవుతోంది. రెజీనాను కొంత మంది ట్రోల్ చేస్తున్నారు. ఆవిడ దగ్గర అలాంటి జోక్లే ఉన్నాయా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. రెండు రోజులు క్రితం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఓ జర్నలిస్ట్ మీద మండిపడ్డారు రెజీనా. ‘సినిమాలో ఓసీడీ ఉన్న అమ్మాయిగా నటించారు. నిజ జీవితంలో మీరు అలా ఉంటారా?’ అని ఒక విలేకరి అడగగా.. అందుకు రెజీనా కస్సుబుస్సులాడారు. ‘మీ దగ్గర ఇటువంటి ప్రశ్నలే ఉన్నాయా? ఇంకేం లేవా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.