Prabhas: 12 ఏళ్ల తర్వాత వారసుడొచ్చాడు.. అక్కడ అరాచకమే!

ABN , First Publish Date - 2022-09-29T21:16:37+05:30 IST

‘‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఇంకో లెక్క.. ఆయన వారసుడొచ్చాడు.. వారసుడొచ్చాడు’’ అంటూ సందడి సందడి చేస్తున్న.. ప్రభాస్ అభిమానుల (Prabhas Fans) ఆనందాన్ని..

Prabhas: 12 ఏళ్ల తర్వాత వారసుడొచ్చాడు.. అక్కడ అరాచకమే!

‘‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఇంకో లెక్క.. ఆయన వారసుడొచ్చాడు.. వారసుడొచ్చాడు’’ అంటూ సందడి సందడి చేస్తున్న.. ప్రభాస్ అభిమానుల (Prabhas Fans) ఆనందాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదంటే నమ్మాలి. రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ‌ను.. ఆయన సొంత ఊరైన మొగల్తూరు (Mogalturu)లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఆ ఫ్యామిలీ సభ్యులు ప్లాన్ చేశారు. గురువారం మొగల్తూరులో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు.. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరు రావడంతో.. ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ప్రభాస్ రాకతో అభిమానుల సందడి ఎలా ఉందంటే.. అరాచకమే అన్నట్లుగా మారిపోయింది. ప్రభాస్ (Prabhas) రాకముందే ఆ ప్రదేశమంతా జనాలతో నిండిపోయింది. ‘ఇది నా ఏరియా..’ అనేలా ప్రభాస్ అడుగుపెట్టాక.. ‘రెబల్ స్టార్’ నినాదాలతో ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా మోత మోగిపోయింది.


ఇక కృష్ణంరాజు సంస్మరణ సభ (KrishnamRaju Samsmarana Sabha) నిమిత్తం ఆ ఫ్యామిలీ సభ్యులందరూ ఒక రోజు ముందుగానే మొగల్తూరు చేరుకున్నారు. ప్రభాస్ మాత్రం గురువారం మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నారు. 2010లో తండ్రి సూర్యనారాయణ రాజు మరణించిన సమయంలో మొగల్తూరు వచ్చిన ప్రభాస్.. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఊరిలో అడుగుపెట్టారు. ప్రభాస్ వస్తున్నాడనే వార్త తెలిసినప్పటి నుండి ఆ ఊరుఊరంతా సందడి వాతావరణం నెలకొంది. రెబల్ స్టార్ అంటూ అభిమానులు చేస్తున్న బైక్ ర్యాలీల వీడియోలో ఇప్పటికే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. 


ఇక మొగల్తూరులో అడుగు పెట్టిన తర్వాత తన ఇంటి ముందు ఉన్న జనసంద్రాన్ని చూసి.. ప్రభాస్ కూడా ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తోంది. తన కోసం, తన ఫ్యామిలీ కోసం వేచి చూస్తున్న వారందరినీ ప్రభాస్ అండ్ ఫ్యామిలీ.. అప్యాయంగా పలకరించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంస్మరణ సభ నిమిత్తం వచ్చిన దాదాపు లక్షమంది అభిమానులకు ప్రభాస్ అండ్ ఫ్యామిలీ భోజన ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది.





Updated Date - 2022-09-29T21:16:37+05:30 IST