SSMB 28 : ఆగస్ట్‌లో కూడా సెట్స్ పైకి కష్టమేనా?

ABN , First Publish Date - 2022-08-18T18:54:48+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో సినిమా కోసం ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఫాన్స్ కోరికని నిజం చేస్తూ... త్రివిక్రమ్ అండ్ మహేశ్ తన కలయికలో మూడో సినిమాని అనౌన్స్ చేశారు.

SSMB 28 : ఆగస్ట్‌లో కూడా సెట్స్ పైకి కష్టమేనా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu),  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో సినిమా కోసం ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఫాన్స్ కోరికని నిజం చేస్తూ... త్రివిక్రమ్ అండ్ మహేశ్ తన కలయికలో మూడో సినిమాని అనౌన్స్ చేశారు. అనౌన్స్ అయితే చేశారు కానీ ఇప్పటివరకూ ఈ మూవీ గురించి ఒక్క అప్డేట్ కూడా బయటకి రాలేదు. ఫాన్స్‌లో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యే టైంకి, ఆగస్ట్ నుంచి SSMB 28 సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ప్రకటించారు. కానీ... ఇప్పటికే ఆగస్ట్ మొదలయ్యి మూడు వారాలు అయింది. కానీ మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు. 


ఇక మిగిలిన లాస్ట్ వీక్ లో అయినా సెట్స్ మీదకి వెళ్తుందా అంటే చిత్ర యూనిట్ కూడా కాన్ఫిడెంట్‌గా చెప్పలేని పరిస్థితి. తాజాగా ఈ డిలేకి ఇంకో రీజన్ యాడ్ అయ్యింది. SSMB 28 సినిమా ఆర్ట్ డైరెక్టర్ మారుతున్నాడట. త్రివిక్రమ్ ఒక ఆర్ట్ డైరెక్టర్‌ని అనుకుంటుంటే, ప్రొడ్యూసర్స్ ఇంకో ఆర్ట్ డైరెక్టర్‌ని ఫైనల్ చేస్తున్నారని సమాచారం. దీంతో పాటు మహేశ్ బాబు సినిమా సెట్స్ పైకి వెళ్ళకుండా ఆపుతున్న మరో ముఖ్య విషయం ఆర్టిస్ట్స్ ఫైనల్ అవ్వకపోవడం. పూజా హెగ్డే (Puja Hegde), శ్రీలీల (Sreeleela) తప్ప మేజర్ కాస్ట్ లో ఎవరూ ఫైనల్ కాలేదని సమాచారం. ఆర్టిస్ట్ లే ఫైనల్ కాకుండా సెట్స్ పైకి వెళ్ళలేరు, ఇంకో వారంలో ఆర్టిస్టులని ఫైనల్ చేయడం అనేది కష్టమైన పని కాబట్టి SSMB 28 సెప్టెంబర్ వరకూ సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు. 

Updated Date - 2022-08-18T18:54:48+05:30 IST