తెరపై కత్రినా కైఫ్‌కు జంటగా విక్కీ కౌశల్‌..?

ABN , First Publish Date - 2022-01-12T23:02:05+05:30 IST

బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ డిసెంబర్ 9, 2021న పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ‘‘ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’’ లో వీరి వివాహం ఘనంగా

తెరపై కత్రినా కైఫ్‌కు జంటగా విక్కీ కౌశల్‌..?

బాలీవుడ్ సెలెబ్రిటీస్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ డిసెంబర్ 9, 2021న పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ‘‘ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’’ లో  వీరి వివాహం ఘనంగా జరిగింది. బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు ఈ వివాహానికి హాజరయ్యారు. పెళ్లి చేసుకున్న అనంతరం ఇద్దరు సినిమా షూటింగ్‌లల్లో బిజీ అయ్యారు.


ఒక బాలీవుడ్  సినిమాలో కత్రినా కైఫ్‌కు జంటగా విక్కీ కౌశల్‌ నటించబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే విక్కీని ఆ పాత్ర కోసం సంప్రదించారని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్లతే.. ఫర్హన్ అక్తర్ ఒక సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఆ చిత్రం పేరు ‘‘ జీ లే జరా ’’. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, ఆలియా భట్, కత్రినా కైఫ్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. కత్రినాకు జంటగా విక్కీ నటిస్తే బాగుంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ చిత్రంలో ఫర్హన్ అక్తర్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పుకారు కనుక నిజమైతే కత్రినా, విక్కీ కలిసి నటించబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. చిత్ర బృందం మాత్రం ఈ విషయాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రియాంక, ఆలియా, కత్రినా హీరోయిన్లుగా నటించబోయే మొదటి చిత్రం కూడా ఇదే.   


ప్రస్తుతం టైగర్-3 సినిమాలో కత్రినా కైఫ్ నటిస్తోంది. సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘‘ ఫోన్ బూత్’’ అనే మరో చిత్రంలోను ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.  ‘‘ బ్రహ్మాస్త్ర ’’, ‘‘ ఆర్ఆర్‌ఆర్’’, ‘‘ గంగూబాయి కథియవాడి’’, ‘‘ తఖ్త్’’, ‘‘ రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’’ తదితర సినిమాల్లో ఆలియా భట్ నటిస్తుంది. 

Updated Date - 2022-01-12T23:02:05+05:30 IST