‘రియల్ దండుపాళ్యం’ వచ్చేస్తోంది
ABN , First Publish Date - 2022-01-28T21:52:04+05:30 IST
రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. శ్రీ వైష్ణో దేవి పతాకంపై, సి.పుట్టస్వామి నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టియఫ్పిసి సెక్రటరి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ...`మగాడి దాష్టీకానికి ఆడవారు ఎలా బలవుతున్నారో దండు పాళ్యం గత సిరీస్ లో చూపించారు. కానీ ఈ రియల్ దండుపాళ్యంలో మహిళలు వారిపై జరిగే అకృత్యాలు, అన్యాయాలపై తిరగబడితే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేసారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. శ్రీ వైష్ణో దేవి పతాకంపై, సి.పుట్టస్వామి నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టియఫ్పిసి సెక్రటరి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ...`మగాడి దాష్టీకానికి ఆడవారు ఎలా బలవుతున్నారో దండు పాళ్యం గత సిరీస్ లో చూపించారు. కానీ ఈ రియల్ దండుపాళ్యంలో మహిళలు వారిపై జరిగే అకృత్యాలు, అన్యాయాలపై తిరగబడితే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేసారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ చూశాక ఒక కర్తవ్యం, ప్రతిఘటన, మౌనపోరాటం చిత్రాలు గుర్తొచ్చాయి. ఈ సినిమా ప్రతి మహిళ చూడాలి. ఇన్ స్పైర్ అవ్వాలి. రాగిణి యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేసింది. ఫిబ్రవరి 4న వస్తోన్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని` అన్నారు.
ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసిన సురేష్ కొండేటి, నిర్మాత సి.పుట్టస్వామి, రామా నాయక్, నటి రాగిణి ద్వివేది, సంజీవ్ చౌహాన్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ సినిమా విశేషాలు తెలిపి, చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మానస. శ్యామ్ సన్, శేఖర్ నాయక్, సందీప్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. మేఘన రాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హర్నడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ‘రియల్ దండుపాళ్యం’ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.