‘ఆహా’తో కలిసి పని చేసేందుకు సిద్ధం: Sundar C
ABN , First Publish Date - 2022-06-25T22:16:45+05:30 IST
భవిష్యత్లో ‘ఆహా’ (Aha) ఓటీటీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని ప్రముఖ దర్శకుడు సుందర్ సి (Sundar C) పేర్కొన్నారు. నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind)
భవిష్యత్లో ‘ఆహా’ (Aha) ఓటీటీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని ప్రముఖ దర్శకుడు సుందర్ సి (Sundar C) పేర్కొన్నారు. నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) వంటి వారు అనేక మందికి స్ఫూర్తి అని, ఆయన ప్రారంభించిన ఓటీటీ ఇపుడు తెలుగులో అగ్రగామిగా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఓటీటీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకకు హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony), దర్శక నటులు ఎస్.జె.సూర్య (S J Suarya), సి సుందర్ తో పాటు హీరోయిన్ రెజీనా (Regena Kasandra), నివేదా సతీష్, దర్శకురాలు పల్లవి గంగిరెడ్డితో పాటు ఆహా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ.. ‘సినిమా రూపొందించడం కంటే ఒక వెబ్ సిరీస్ను తెరకెక్కించడం అంత సులభం కాదు. ఏడు ఎపిసోడ్లలో ప్రతి ఎపిసోడ్కు మూడు ఉత్కంఠ భరితమైన ట్విస్ట్లు ఉండాలి. ఆ విధంగా రూపొందిస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇందులో కెమెరామెన్ పనితనం చాలా బాగా ఉంది. రెజీనా, నివేదా అద్భుతంగా నటించారు’ అని చెప్పుకొచ్చారు. హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ‘పెద్ద ఓటీటీ సంస్థల్లో పోటీపడేలా ఆహాను తీర్చిదిద్దారు. ఈ సిరీస్ను తెరకెక్కించిన దర్శకురాలు పల్లవికి అభినందనలు’ అన్నారు.
దర్శకనటుడు ఎస్.జె.సూర్య మాట్లాడుతూ.. ‘అన్ని విషయాల్లో నిర్మాత అల్లు అరవింద్ అంటే నాకు ఎంతో ఇష్టం. దర్శకుడు మురుగదాస్ టీంలో ఉండే వారిలో ఎంతో ఎనర్జిటిక్గా ఉండే యువతి పల్లవి. ఆమె తెరకెక్కించిన వెబ్ సిరీస్ ట్రైలర్ ఆవిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు. రెజీనా మాట్లాడుతూ.. ‘బాహుబలి వంటి చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్కా మీడియా వర్క్స్ ఇపుడు ఓటీటీ ఫ్లాట్ఫాంలోకి ప్రవేశించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వెబ్ సిరీస్ జూలై 1వ తేదీనుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రెజీనా, నివేదా సతీష్ కీలక పాత్ర పోషించారు. ఆహా తమిళం తరపున అజిత్ ఠాగూర్, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.