RC 15: దిల్ రాజుపై ట్రోల్స్..ఎందుకంటే..?
ABN , First Publish Date - 2022-08-12T18:29:57+05:30 IST
ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) మీద మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. దీనికి కారణం ఆర్సీ 15 (RC 15) సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏవీ ఇవ్వకపోవడమే.
ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) మీద మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. దీనికి కారణం ఆర్సీ 15 (RC 15) సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏవీ ఇవ్వకపోవడమే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) జంటగా, దిల్ రాజు-శిరీష్ కలిసి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి 50వది కావడం విశేషం. అలాగే, చరణ్ కెరీర్లో కూడా 15వ చిత్రం.
అందుకే, ఈ మూవీని దిల్ రాజు బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా దాదాపు 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే, ఆర్సీ 15 సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయిందని సమాచారం. అయితే, ఆగస్ట్ 1వ తేదీ నుంచి షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కానీ, తమిళ హీరో విజయ్తో దిల్ రాజు నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం వారసుడు మాత్రం వైజాగ్లో చిత్రీకరణ జరుగుతోంది. నేటితో అక్కడ షెడ్యూల్ పూర్తవుతుందట. ఇక శంకర్, ఆర్సీ 15 ని ప్రస్తుతానికి పక్కన పెట్టి కమల్ హాసన్తో ఇండియన్ 2 చిత్రాన్ని సెట్స్పైకి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు.
సెప్టెంబర్ రెండవ వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవబోతుంది. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ కూడా ఇదే విషయాన్ని ఇటీవల కన్ఫర్మ్ చేసింది. దాంతో ఆర్సీ 15 ని దిల్ రాజు పట్టించుకోవడం లేదని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అప్డేట్స్ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన WAKE UP DILRAJU, #WakeUpDilRaju అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది.