మరో దర్శకుడికి Raviteja గ్రీన్ సిగ్నల్..?

ABN , First Publish Date - 2022-07-10T18:26:25+05:30 IST

మాస్ మహారాజ రవితేజ (Raviteja) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినా కథ నచ్చితే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలా సంపత్ నంది (Sampath Nandi)తో సినిమా చేసేందుకు ఒకే చెప్పినట్టు తాజా సమాచారం.

మరో దర్శకుడికి Raviteja గ్రీన్ సిగ్నల్..?

మాస్ మహారాజ రవితేజ (Raviteja) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినా కథ నచ్చితే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలా సంపత్ నంది (Sampath Nandi)తో సినిమా చేసేందుకు ఒకే చెప్పినట్టు తాజా సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో బెంగాల్ టైగర్ అనే సినిమా వచ్చింది. తమన్నా (Tamannah), రాశిఖన్నా Rashi Khanna) హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి మళ్ళీ రవితేజ - సంపత్ నంది కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుందట.


గత ఏడాది సంపత్ నంది.. గోపీచంద్ (Gopichand), తమన్నాలతో రూపొందించిన 'సీటీమార్' వచ్చింది. భారీ అంచాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక తన పర్యవేక్షణలో మొదలైన 'బ్లాక్ రోజ్' అనే సినిమా కూడా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెల ప్రధాన పాత్రను పోషించింది. ఇలా సంపత్ నంది సినిమాలు సక్సెస్ అందుకొని చాలా కాలం అయింది. అందుకే, ఈ సారి హిట్ కొట్టేందుకు రవితేజతో జత కట్టాలని చూస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఇటీవల రవితేజకి ఒక లైన్ చెప్పగా అది నచ్చి మాస్ రాజా ఒకే అన్నాడట.


ప్రస్తుతం మాస్ మహారాజా.. 'రావణాసుర', 'రామారావు ఆన్‌డ్యూటీ', 'టైగర్ నాగేశ్వర రావు', 'ధమాకా', మెగా '154' చిత్రాలు చేస్తున్నారు. ఇవి పూర్తయ్యాక సంపత్ నందితో సినిమా చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

Updated Date - 2022-07-10T18:26:25+05:30 IST