Maheshbabu జోడీగా మళ్ళీ రష్మిక ?
ABN , First Publish Date - 2022-06-09T18:38:05+05:30 IST
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu) ఇటీవల ‘సర్కారువారి పాట’ (Sakaruvaari Paata) చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తదుపరిగా అతడు నటించే సినిమాపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చేనెల్లోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu) ఇటీవల ‘సర్కారువారి పాట’ (Sakaruvaari Paata) చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తదుపరిగా అతడు నటించే సినిమాపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చేనెల్లోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. SSMB 28 గా పిలుచుకుంటోన్న ఈ సినిమా కోసం ‘అర్జునుడు’ (Arjunudu) అనే పవర్ ఫుల్ టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టు ఇదివరకు వార్తలొచ్చాయి. గతంలో మహేశ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అతడు (Athadu), ఖలేజా (Khaleja)’ చిత్రాలు మంచి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ హ్యాట్రిక్ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Harika and Hasini creations), సితారా ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ‘మహర్షి’ (Maharshi) చిత్రంతో మొట్టమొదటి సారిగా మహేశ్ సరసన పూజా కథానాయికగా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో పూజా ఈ సినిమాకి పాజిటివ్ సెంటిమెంట్గా మారింది.
ఇదిలా ఉండగా.. SSMB 28 పై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా కథానాయికగా ఇప్పుడు రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) పేరు కూడా వినిపిస్తోంది. త్రివిక్రమ్కు ఆల్రెడీ పూజా సెంటిమెంట్ ఉంది కాబట్టి.. ఆమెను ఈ సినిమానుంచి తప్పించడం జరగనిపని. మరో కథానాయికగా రష్మికాను ఎంపిక చేశారా? లేదా ? అన్న విషయంలో క్లారిటీ లేదు. రష్మికా సైతం మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) చిత్రంలో జోడీ కట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా హిట్టవడంతో ఆమె విషయంలో కూడా మహేశ్ బాబుకు పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. ఇంతకీ SSMB 28లో రష్మిక మందణ్ణ రెండో హీరోయిన్ గా నటిస్తుందా.. అసలు ఈ వార్తల్లో నిజానిజాలేంటన్నది చూడాలి.