మీ ఇద్దరూ చించేశారు: రష్మిక మందన్న

ABN , First Publish Date - 2021-12-22T23:51:14+05:30 IST

మా టీమ్‌కు ఎక్కువగా దిష్టి తగులుతుంది. అందుకే ఆ దిష్టి నేను తీస్తున్నాను. పుష్ప సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ ఎంతో కష్టపడ్డారు. కావాల్సిన ప్రతి ఒక్కటి కాదనకుండా ఇచ్చారు. ఈరోజు ఈ సినిమా ఇంత అద్భుతంగా

మీ ఇద్దరూ చించేశారు: రష్మిక మందన్న

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం.. విడుదలైన అన్ని చోట్లా విజయఢంకా మ్రోగిస్తోంది. సినిమా సంచలన విజయం అందుకోవడంతో మంగళవారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అభిమానుల కోలాహలం మధ్య చిత్రయూనిట్ సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో రష్మిక మందన్న మాట్లాడుతూ.. ఈ సినిమాలో చేసిన నటనకు గానూ నేషనల్ అవార్డులతో పాటు అన్ని అవార్డులు అల్లు అర్జున్‌కి రాకపోతే హర్టవుతానని ప్రకటించింది. 


‘‘అల్లు అర్జున్‌గారికి నేను ఫ్యాన్ కాదు అంతకు మించి.. సినిమాలో ఎంత అద్భుతంగా నటించారు..? ఖచ్చితంగా ఈ ఏడాది నేషనల్ అవార్డులతో పాటు అన్ని అవార్డులు మీకు రాకపోతే నేను హర్ట్ అవుతాను. ఏమి నటన, ఏమి యాటిట్యూడ్.. అబ్బో మాములుగా ఉండదు. సుకుమార్ గారు మీ డైరెక్షన్ సూపర్. మీరిద్దరూ కలిసి చించేశారు. స్క్రీన్ మీద ఎనర్జీ చూస్తుంటే మాట్లాడటానికి మాటలు సరిపోవడం లేదు. దేవిశ్రీగారు మీ పాటలు అద్భుతం. ప్రతి ఒక్క పాట అదిరిపోయింది. మీ ముగ్గురి కాంబినేషన్‌లో మరిన్ని హిట్ సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. మా టీమ్‌కు ఎక్కువగా దిష్టి తగులుతుంది. అందుకే ఆ దిష్టి నేను తీస్తున్నాను. పుష్ప సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ ఎంతో కష్టపడ్డారు. కావాల్సిన ప్రతి ఒక్కటి కాదనకుండా ఇచ్చారు. ఈరోజు ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది అంటే దానికి కారణం మైత్రి మూవీ మేకర్స్. సునీల్‌గారు అద్భుతంగా నటించారు. మొదటిసారి ఆయనని చూసి.. గుర్తు పట్టలేకపోయాను. సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందంటే దానికి కుబా సర్ కూడా ఒక ప్రధానమైన కారణం. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు..’’ అని రష్మిక ఈ సక్సెస్ పార్టీలో ప్రసంగించింది.

Updated Date - 2021-12-22T23:51:14+05:30 IST