ఆ బాలీవుడ్ హీరోతో వర్క్ చాలా సరదాగా ఉంటుంది : రష్మిక మందన్నా
ABN , First Publish Date - 2022-01-03T21:09:24+05:30 IST
‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ సాధించింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. అనంతరం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా ఎదిగింది...
‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ సాధించింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. అనంతరం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా ఎదిగింది.
ఇప్పటి వరకూ సౌతిండియా భాషల్లో నటించిన ఈ భామ త్వరలో బాలీవుడ్కి సైతం ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. గతంలోనే ఈ మూవీ స్టోరీ డిస్కషన్స్లో ఈ నటుడితో కలిసి పాల్గొంది ఈ బ్యూటీ. కాగా త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్తో వర్క్ గురించి రష్మిక మాట్లాడుతూ.. ‘సిద్ధార్థ్తో పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఇంతకుముందు కలిసినప్పుడు మేము చాలా అంశాలపై మాట్లాడుకున్నాం. మేము సెట్స్లో కలిసి తిన్నాం. చాలాసార్లు కలిసి వర్క్అవుట్ కూడా చేసాం. ఆయన అద్భుతమైన నటుడే కాకుండా మంచి వ్యక్తి కూడా. ‘మిషన్ మజ్ను’ ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంద’ని తెలిపింది. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ సైతం పెట్టింది.