బాలీవుడ్ చాక్లెట్ బోయ్తో జోడి కట్టనున్న రష్మిక మందన్నా?
ABN , First Publish Date - 2022-03-30T18:31:29+05:30 IST
‘ఛలో’ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్గా ఎదిగిన నటి రష్మికా మందన్నా. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో..
‘ఛలో’ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్గా ఎదిగిన నటి రష్మికా మందన్నా. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్గా మారిపోయింది. అంతేకాకుండా యువ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి చేస్తున్న ‘మిస్టర్ మజ్ను’తో బాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ తరుణంలో ఈ బ్యూటీ గురించి మరో క్రేజీ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
బాలీవుడ్ చాక్లెట్ బోయ్గా పేరుపొందిన రణ్బీర్ కపూర్తో రష్మికా జోడి కట్టనుందనేదే ఆ వార్త. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఆ చిత్రమే ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’తో భారతీయ సినీ పరిశ్రమలని తన వైపు చూసేలా చేసుకున్న సందీప్ ‘కబీర్ సింగ్’ తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమే ఈ యానిమల్. నిజానికి ఈ సినిమాలో మొదట బాలీవుడ్ నటి పరిణితీ చోప్రాని హీరోయిన్గా అనుకున్నారు. కానీ.. తాజాగా ఆమె స్థానంలో రష్మిక పేరు వచ్చి చేరింది. కొత్త జంట తెరమీద కనిపిస్తే ప్రేక్షకులు ఫ్రెష్గా ఫీల్ అవుతారని నిర్మాత భూషన్ కుమార్తోపాటు డైరెక్టర్ సందీప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. పుష్పతో ప్యాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న రష్మికా సినిమాకి ఇంకా ప్లస్ అవుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం.
కాగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్ నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ మొదటి పార్ట్ని ఇటీవలే పూర్తి చేశాడు. ఇందులో.. అలియా భట్ ఆయనకి జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం డైరక్టర్ లవ్ రంజన్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా పూర్తైన తర్వాత ఈ ‘యానిమల్’ చిత్రం పట్టాలెక్కనుంది.