పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన రష్మిక మందన్న

ABN , First Publish Date - 2022-03-04T02:25:56+05:30 IST

నా పెళ్లిపై అనేక రకాలుగా పుకార్లు వస్తున్నాయి. అవి నా వరకు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం నాకు లేదు. నా పెళ్లికి ఇంకా చాలా టైముంది..’’ అని తెలిపారు రష్మిక మందన్న. యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం

పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన రష్మిక మందన్న

‘‘నా పెళ్లిపై అనేక రకాలుగా పుకార్లు వస్తున్నాయి. అవి నా వరకు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం నాకు లేదు. నా పెళ్లికి ఇంకా చాలా టైముంది..’’ అని తెలిపారు రష్మిక మందన్న. యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈనెల 4న (శుక్రవారం) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ‘పెళ్లి ఎప్పుడు?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె పై విధంగా సమాధానమిచ్చారు.


ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం తర్వాత ఫ్యామిలీ సినిమా చేశాం. థియేటర్‌కి వచ్చి చూడండి. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలోని పాత్రలు మన ఇంటిలో అమ్మ, చెల్లి ఎలా మాట్లాడతారో అలానే ఉంటాయి. కొన్ని సంఘటనలు మన ఇంటిలో జరిగేవిగా కనిపిస్తాయి. మా ఇంటిలో కూడా అమ్మ, నాన్న, చెల్లి ఈ సినిమా విడుదల రోజు తొలి ఆట చూస్తానన్నారు. మీరు కుటుంబంతో ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు. ఇంకా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలు చేశాక మహిళగా డ్రెస్సింగ్‌లో చాలా కష్టం అనిపించింది. అందుకే వచ్చే జన్మంటూ వుంటే మగవాడిగా పుడతా’ అని నవ్వుతూ బదులిచ్చారు. అలాగే పెళ్లి గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాను. తర్వాత మంచి మనసున్న వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటాను.. ఇప్పటి వరకు ఎవరితోనూ పెళ్లి ఫిక్స్ కాలేదు’’ అని పెళ్లిపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చిందీ శ్రీవల్లి.



Updated Date - 2022-03-04T02:25:56+05:30 IST