Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో ముద్దు సీన్.. కలలో కూడా ఏడిచానంటున్న రష్మిక
ABN , First Publish Date - 2022-10-04T15:21:11+05:30 IST
దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్స్లో నటీమణుల్లో రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఒకరు..
దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్స్లో నటీమణుల్లో రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఒకరు. దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా ఉన్న ఈ బ్యూటీ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్తో వరుస బాలీవుడ్ సినిమాలను కమిట్ అయ్యింది. ఈ తార నటించిన మొదటి బాలీవుడ్ చిత్రం ‘గుడ్ బై’ చిత్రం త్వరలో విడుదల కానుంది. దీంతో చిత్ర ప్రమోషన్స్లో మూవీ టీం తలమునకలై ఉంది. ఇందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ సినిమా వల్ల ఏడ్చిన ఓ సందర్భం గురించి ఈ భామ తెలియజేసింది.
టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక జంటగా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నటుల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే.. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ రెండు సినిమాల్లోనూ లిప్ కిస్ సీన్లు ఉంటాయి. ముఖ్యంగా ‘డియర్ కామ్రేడ్’లో చేసిన ముద్దు సీన్ కారణంగా విజయ్, రష్మికపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. పబ్లిసిటీ కోసమే ఆ ముద్దు సీన్ సినిమాలో పెట్టారని.. పాపులారిటీ కోసం ఏదైనా చేస్తారా అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేశారు. దాంతో చాలా రోజులు పీడ కలలు వచ్చేవని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక తెలిపింది.
ఆ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ‘మొదటి సినిమాలో ముద్దు సీన్పై అంతా ట్రోలింగ్ జరగలేదు. కానీ.. డియర్ కామ్రేడ్ సినిమాలోని ముద్దు సీన్పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. పబ్లిసిటీ కోసమే చేశారంటూ చాలా మంది విమర్శలు చేశారు. దాంతో చాలా బాధ పడ్డాను. ఆ బాధ కొన్ని నెలల పాటు అలాగే ఉంది. అవి చాలా బాధాకరమైన రోజులు. ఆ సమయంలో నా గురించి నేనే చాలా బాధాకరమైన విషయాలను చదివాను.
దాంతో చాలా రోజుల పాటు పీడ కలలు వచ్చేవి. అందులో.. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నట్లు అనిపించేది. ప్రతి ఒక్కరూ నాకు వెన్నుపోటు పొడుస్తున్నారని అనిపించేది. ఆ కల దాదాపు ప్రతి రోజు వచ్చేది. అది నిజమో, కాదో అర్థమయ్యేది కాదు. అలాంటి పిచ్చి కలలతో నిద్ర లేచి.. బెడ్ మీదనే కూర్చుని ఏడ్చేదాన్ని.. కొన్ని సార్లైతే ఏడుస్తూనే నిద్ర లేచాను. అయితే.. ఈ విషయాల గురించి నా తల్లిదండ్రుల గురించి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే.. వారికి ఇలాంటి విషయాలు అంతగా తెలియదు. నా కారణంగా వారు బాధ పడడం నాకు ఇష్టం లేదు’ అని తెలిపింది.
కాగా.. రష్మిక ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, రణ్బీర్ కపూర్తో ‘యానిమల్’ వంటి బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. అలాగే.. విజయ్ దళపతితో ‘వారసుడు’ అనే తమిళ, తెలుగు చిత్రం చేస్తోంది. అలాగే అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’లో నటిస్తూ కెరీర్లో దూసుకుపోతోంది.