Rashmika Mandanna : పారితోషికం అంత పెంచేసిందా?

ABN , First Publish Date - 2022-08-08T15:23:52+05:30 IST

‘పుష్ప’ (Pushpa) చిత్రంతో నేషనల్ వైడ్ సెన్సేషనల్ క్రష్ అయిపోయింది అందాల రష్మికా మందణ్ణ (Rashmika Mandanna). శ్రీవల్లిగా ఆమె అభినయానికి పాన్ ఇండియా స్థాయిలో పేరొచ్చింది. ఒకే ఒక సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆమెకు వరుసగా క్రేజీ ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి.

Rashmika Mandanna : పారితోషికం అంత పెంచేసిందా?

‘పుష్ప’ (Pushpa) చిత్రంతో నేషనల్ వైడ్ సెన్సేషనల్  క్రష్ అయిపోయింది అందాల రష్మికా మందణ్ణ (Rashmika Mandanna). శ్రీవల్లిగా ఆమె అభినయానికి పాన్ ఇండియా స్థాయిలో పేరొచ్చింది. ఒకే ఒక సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆమెకు వరుసగా క్రేజీ ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఫుల్ బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రల్లో కనిపించి అభిమానుల్ని అలరిస్తోంది. 


తాజాగా ‘సీతారామం’ (Sitaramam) చిత్రంలో ఆఫ్రీన్ అనే పాకిస్థాన్ అమ్మాయిగా అభినయించిన ఈ బ్యూటీకి మంచి అప్లాజ్ లభిస్తోంది. ఆమె పాత్రతోనే కథ కీలకమలుపు తిరుగుతుంది. ఇలా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న రష్మికా.. తదుపరి చిత్రాల కోసం తన పారితోషికాన్ని ఓ రేంజ్‌లో పెంచేసినట్టు సమాచారం. ‘పుష్ప’ చిత్రం కన్నా ముందు.. రూ. 1కోటి అందుకున్న రష్మికా.. ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేస్తోందట. 


బాలీవుడ్ చిత్రాలకు నాలుగు కోట్లు, తెలుగు చిత్రాలకు మూడు కోట్లు పారితోషికంగా ఇవ్వాలని నిర్మాతలకు చెబుతోందట. ప్రస్తుతం రష్మికాకు పాన్ ఇండియాలో ఉన్న స్టార్‌డమ్ చూసి అంత మొత్తంలో ఇవ్వడానికి నిర్మాతలు ఓకే చెప్పారట. ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ, సినిమా మేకింగ్ ఖర్చులు తగ్గించుకోడానికి ఒక పక్క నిర్మాతలు ప్రయత్నం చేస్తుంటే, మరో పక్క స్టార్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ పెంచడం పట్ల కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నటీనటుల స్థాయిని బట్టి అంత పారితోషికం అడగడంలో తప్పేంటని కొందరు అంటుంటే, అంత భారీ పారితోషికాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మరికొందరు విమర్శిస్తున్నారు. 

Updated Date - 2022-08-08T15:23:52+05:30 IST