పవర్ స్టార్ పుట్టినరోజున.. ‘రంగ రంగ వైభవంగా’
ABN , First Publish Date - 2022-07-14T00:26:49+05:30 IST
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. బాపినీడు.బి సమర్పణలో..
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ హీరో వైష్ణవ్ తేజ్(Vaisshnav Tej) హీరోగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga). బాపినీడు.బి సమర్పణలో.. తమిళంలో ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ (Gireesaaya) దర్శకుడిగా.. సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన కేతికా శర్మ (Ketika Sharma) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా బుధవారం ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘మెగా హీరోలందరితోనూ సినిమాలు చేశాను. ఇప్పుడు వైష్ణవ్ తేజ్తో ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేశాను. రీసెంట్గా విడుదలైన టీజర్కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సినిమాను సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తున్నాం. ఆ రోజు ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
చిత్ర దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ.. ‘‘రంగ రంగ వైభవంగా’ సెప్టెంబర్ 2న రిలీజ్ అవుతుంది. ఆ రోజు మెగాభిమానులకు పండుగ రోజు. ఆ పండుగని ఈ సినిమాతో సెలబ్రేట్ చేసుకుందాం. ఈ సినిమాలో వైష్ణవ్ కొత్తగా కనిపిస్తారు. అలాగే కేతికా శర్మ తనదైన నటనతో మెస్మరైజ్ చేసింది. నిర్మాతల సపోర్ట్తో సినిమాను చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశాం. దేవిశ్రీగారి మ్యూజిక్, శ్యామ్ దత్గారి విజువల్స్ సినిమాకు మేజర్ ఎసెట్స్ అవుతాయి. టీజర్ చూసినవారు ఎక్స్ట్రార్డినరీగా ఉందన్నారు. మూవీ కూడా అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. అని తెలిపారు.