Animal లో నా పాత్రను చూసి షాక్కు గురవుతారు: Ranbir Kapoor
ABN , First Publish Date - 2022-07-16T01:51:24+05:30 IST
సినీ ఇండస్ట్రీకి స్టార్ కిడ్గా ఎంట్రీ ఇచ్చినప్పటికి కొత్త రకం పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన నటుడు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor). బర్ఫీ(Barfi), యే జవానీ హై దివానీ (Yeh Jawani Hai Deewani),
సినీ ఇండస్ట్రీకి స్టార్ కిడ్గా ఎంట్రీ ఇచ్చినప్పటికి కొత్త రకం పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన నటుడు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor). ‘బర్ఫీ’(Barfi), ‘యే జవానీ హై దివానీ’ (Yeh Jawani Hai Deewani), ‘తమాషా’ (Tamasha), ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ (Ajab Prem Ki Gazab Kahani), ‘సంజు’ (Sanju) వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించాడు. తాజాగా ‘షంషేరా’ (Shamshera) లో నటించాడు. ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తాను నటిస్తున్న సినిమాల గురించి వివరించాడు.
నెగెటివ్ రోల్స్లో నటించాలని ఉందని రణ్బీర్ కపూర్ చెప్పాడు. ‘యానిమల్’ లో తాను పోషిస్తున్న పాత్రలో కొంచెం నెగెటివ్ ఛాయలు ఉన్నాయని తెలిపాడు. ‘‘సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ (Animal)లో నేను నటిస్తున్నాను. ఆ సినిమాలో నా పాత్రను చూసి అందరికి షాక్ తగులుతుంది. ఆ రోల్ లో కొంచెం నెగెటివ్ ఛాయలు ఉన్నాయి. ఇప్పటికే ఆ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. నా మీద కొన్ని రోజులు చిత్రీకరించారు. ఆ పాత్రలో నటించడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది, ఆ విధంగానే కొంచెం భయంగా ఉంది’’ అని రణ్బీర్ కపూర్ చెప్పాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీలో గీతాంజలి అనే పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా మొదటగా పరిణీతి చోప్రాను అనుకున్నారు. కానీ, ఆమెకు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది. అనంతరం ఈ మూవీలో కథానాయికగా రష్మికను తీసుకున్నారు. ‘యానిమల్’ వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.