Ranbir Kapoor: రణ్బీర్ సినిమా సెట్లో భారీ అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2022-07-30T01:39:54+05:30 IST
విలక్షణమైన కథలు, కొత్త రకం పాత్రలతో అభిమానులను అలరిస్తున్న నటుడు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor). ‘యే జవానీ హై, దివానీ’, ‘సంజు’ చిత్రాలతో అభిమానులను అలరించాడు. అతడి నుంచి చివరగా
విలక్షణమైన కథలు, కొత్త రకం పాత్రలతో అభిమానులను అలరిస్తున్న నటుడు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor). ‘యే జవానీ హై, దివానీ’, ‘సంజు’ చిత్రాలతో అభిమానులను అలరించాడు. అతడి నుంచి చివరగా వచ్చిన సినిమా ‘షంషేరా’ (Shamshera). యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. రణ్బీర్ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ‘యానిమల్’ (Animal) తో పాటు లవ్ రంజన్ దర్శకత్వంలో చిత్రాలు చేస్తున్నాడు. రణ్బీర్ హీరోగా నటిస్తున్న ఓ మూవీ సెట్లో తాజాగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
లవ్ రంజన్ (Luv Ranjan) దర్శకత్వంలో రణ్బీర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా కోసం ముంబై సబర్బన్ అంధేరిలోని చిత్ర కూట్ గ్రౌండ్లో ఓ సెట్ చేశారు. ఈ మూవీ సెట్లోనే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సెట్లో మధ్యాహ్నం 4.30 గంటలకు ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. తొలుత ఆ ప్రాంతంలోని ఒక దుకాణంలో మంటలు వచ్చినట్టు అధికారులు చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఫిల్మ్ సెట్లో మంటలు చెలరేగినట్టు ధ్రువీకరించారు. దట్టమైన పొగలు చట్టుపక్కల వ్యాపించడంతో మంటలను అదుపు చేసేందుకు మూడు అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు రణ్బీర్, శ్రద్ధా కపూర్ సినిమా సెట్లో లేరని సమాచారం. మంటలు చెలరేగినప్పుడు సన్నీ డియోల్ కుమారుడు రాజ్వీర్ డియోల్ సినిమా షూటింగ్ చిత్ర కూట్ స్టూడియోలోనే జరుగుతుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ అగ్ని ప్రమాదంలో ఆ చిత్ర బృందానికీ కూడా ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.