Brahmastra: నాగార్జున, రాజమౌళి, రణ్‌బీర్ కపూర్.. అరిటాకులో చెన్నై భోజనం.. వైరలవుతున్న వీడియో

ABN , First Publish Date - 2022-08-26T19:09:32+05:30 IST

దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురు చూస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియాభట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి..

Brahmastra: నాగార్జున, రాజమౌళి, రణ్‌బీర్ కపూర్.. అరిటాకులో చెన్నై భోజనం.. వైరలవుతున్న వీడియో

దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురు చూస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియాభట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున (Nagarjuna) ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. దీంతో ఈ సినిమాని సౌత్ ఇండియాలో డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి (Rajamouli) సమర్పిస్తున్నాడు.


దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌ కోసం నాగార్జున, రణ్‌బీర్ కపూర్, రాజమౌళి దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిన్నారు. ఈ తరుణంలో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ ముగ్గురు స్టార్లు హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో భాగంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలను సమాధానాలు తెలిపారు. అనంతరం ఈ ముగ్గురు స్టార్లు కలిసి చెన్నైలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేశారు. అది కూడా ప్రత్యేకంగా తయారు చేసిన చెన్నై తాలిని అరిటాకులో తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


దీంతో పలువురు నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘వావ్.. వాళ్లు అరిటాకులో తింటున్నారా’ అని కొందరూ.. ‘ఈ స్టార్లని ఇలా చూడడం చాలా బావుంది’ అని మరికొందరూ రాసుకొచ్చారు. అయితే.. ఈ వీడియోలో నాగార్జున, రాజమౌళి సహజంగా అలవాటైనట్లు తింటుండగా.. రణ్‌బీర్ కొంచెం ఇబ్బందిపడుతున్నట్లు కనిపించింది. దాంతో అది కేవలం ప్రమోషన్స్ కోసమే అలా చేస్తున్నాడని కొందరు విమర్శలు సైతం చేస్తున్నారు.



Updated Date - 2022-08-26T19:09:32+05:30 IST