Rashmika Mandanna: రణ్బీర్ కపూర్ ఏడిపించాడంటున్న క్రేజీ బ్యూటీ.. ఇంతకీ అతనేం చేశాడంటే..
ABN , First Publish Date - 2022-10-02T15:39:18+05:30 IST
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ.. అత్యంత ప్రజాదరణ పొందిన అతి కొద్దిమంది నటీమణులలో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు...
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ.. అత్యంత ప్రజాదరణ పొందిన అతి కొద్దిమంది నటీమణులలో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. ఈ దక్షిణాది టాప్ హీరోయిన్ తన కొత్త చిత్రం ‘గుడ్బై’తో బాలీవుడ్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీలో ఈ భామ అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, పావైల్ గులాటితో కలిసి నటించింది. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ యువ నటుడు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) ఈ భామని ఏడిపించిన క్షణాల గురించి పంచుకుంది.
అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’తో వచ్చిన క్రేజ్తో రష్మిక వరుస బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ‘యానిమల్’ మూవీ ఒకటి. రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. షూటింగ్ సమయంలో రణ్బీర్ చేసిన ఓ పనికి రష్మికని కన్నీళ్లు పెట్టుకుందట. ఈ విషయం గురించి రష్మిక మాట్లాడుతూ.. ‘మేము యానిమల్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు.. నా బ్రేక్ఫాస్ట్ నాకు నచ్చలేదు. చాలా బోరింగ్గా ఉందని యూనిట్కి చెప్పాను. దాంతో.. మరుసటి రోజు ఉదయం రణ్బీర్ నా కోసం రుచికరమైన అల్పహారం తీసుకొచ్చాడు. అది కూడా నా కోసం తన చెఫ్తో ప్రత్యేకంగా వంట చేయించుకుని వచ్చి మరి నాకు ఇచ్చాడు. అది చూసి నేను ఏడవడం మొదలు పెట్టాను. ఆయన తెచ్చిన ఫుడ్ చాలా బాగుంది. అదే విషయం చెప్పి ఏడ్చేశాను’ అని చెప్పుకొచ్చింది.
కాగా.. రష్మిక ప్రస్తుతం ‘గుడ్బై’, ‘యానిమల్’తోపాటు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’ నటిస్తోంది. అంతేకాకుండా, రోహిత్ ధావన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న‘రాంబో’ రీమేక్లో కూడా ఈ భామకి అవకాశం వచ్చినట్లు సమాచారం. అలాగే.. తమిళ నటుడు విజయ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. వాటితో పాటు పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ ‘పుష్ప’కి సీక్వెల్గా రానున్న ‘పుష్ప 2’లో నటిస్తోంది.