Ranbir Kapoor: ‘షంషేరా’ పరాజయానికి కారణమేంటో నాకు తెలుసు

ABN , First Publish Date - 2022-09-08T00:56:00+05:30 IST

సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికి ఆ నీడ తన మీద పడకుండా చూసుకున్న నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). తాజాగా అతడు నటించిన నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్

Ranbir Kapoor: ‘షంషేరా’ పరాజయానికి కారణమేంటో నాకు తెలుసు

సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికి ఆ నీడ తన మీద పడకుండా చూసుకున్న నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). తాజాగా అతడు నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఢిల్లీలో ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ‘షంషేరా’ (Shamshera) పరాజయంపై రణ్‌బీర్ కపూర్ స్పందించాడు.


‘షంషేరా’ లో కథ బాగా లేకపోవడంతో ప్రేక్షకులకు నచ్చలేదని రణ్‌బీర్ తెలిపాడు. అందువల్ల బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయిందని చెప్పాడు. కానీ, ‘బ్రహ్మాస్త్ర’ మాత్రం అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. ‘బ్రహ్మాస్త్ర’ పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, అక్కినేని నాగార్జున, మౌనిరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం తొలిరోజు రూ. 25కోట్ల నుంచి రూ. 30కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘షంషేరా’ ను యశ్‌ రాజ్ ప్రొడక్షన్స్ రూ. 200కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించింది. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. సంజయ్ దత్ విలన్‌గా నటించాడు. ప్రపంచవ్యాప్తంగా జులై 27న ఈ సినిమా విడుదలయ్యింది. చిత్రం విడుదలైన మొదటి రోజే ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

Updated Date - 2022-09-08T00:56:00+05:30 IST