వామ్మో.. Shamshera లో నటించినందుకు Ranbir Kapoor, Sanjay Dutt ఎన్ని కోట్లు తీసుకున్నారంటే..
ABN , First Publish Date - 2022-06-24T20:51:38+05:30 IST
బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ యశ్రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films)నిర్మించిన సినిమా ‘షంషేరా’ (Shamshera). పాన్ ఇండియాగా మేకర్స్ రూపొందించారు. రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా
బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ యశ్రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films)నిర్మించిన సినిమా ‘షంషేరా’ (Shamshera). పాన్ ఇండియాగా మేకర్స్ రూపొందించారు. రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించారు. వాణీ కపూర్ (Vaani Kapoor), సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ను వేగవంతం చేసింది. అందులో భాగంగా జూన్ 24న ట్రైలర్ను విడుదల చేసింది. 1800ల నేపథ్యంగా స్టోరీ ఉండబోతున్నట్టు ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది. ‘షంషేరా’ కు కరణ్ మల్హోత్రా(Karan Malhotra) దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
‘షంషేరా’ లో నటించేందుకు రణ్బీర్ కపూర్, సంజయ్ దత్ భారీగా పారితోషికాలు తీసుకున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. రణ్బీర్ రూ. 20కోట్లను రెమ్యూనరేషన్గా తీసుకున్నారని సమాచారం. సంజు బాబా ఈ చిత్రంలో శుద్ధ్ సింగ్ పాత్రలో కనిపించారు. ఈ పాత్రకు గాను రూ. 8కోట్లను పారితోషికంగా అందుకున్నారట. మూవీలో కీలక పాత్రలో కనిపించిన రోనిత్ రాయ్ రూ. 4కోట్లను తీసుకున్నారని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. రణ్బీర్ చివరగా రాజ్కుమార్ హీరాణీ తెరకెక్కించిన ‘సంజు’ (Sanju) చిత్రంలో కనిపించారు. ఈ సినిమా 2018లో విడుదలైంది. అనంతరం ఆయన నుంచి ఏ మూవీ రాలేదు. నాలుగేళ్ల తర్వాత తాజాగా ‘షంషేరా’ ను రిలీజ్ చేస్తున్నారు.