Rana Daggubati: ఇన్స్టాగ్రామ్కు బై.. బై!
ABN , First Publish Date - 2022-08-09T23:29:12+05:30 IST
సినీ సెలబ్రిటీల్లో ఎక్కువశాతం సోషల్ మీడియాకు అత్యంత దగ్గరగా ఉంటారు. ఈ వేదిక వల్ల అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. వృత్తి, వ్యక్తిగత విషయాల గురించి షేర్ చేసుకుంటారు. అయితే హీరో దగ్గుబాటి రానా (Rana daggubati) సోషల్ మీడియాను అతి తక్కువగా ఉపయోగిస్తుంటారు.
సినీ సెలబ్రిటీల్లో ఎక్కువశాతం సోషల్ మీడియాకు అత్యంత దగ్గరగా ఉంటారు. ఈ వేదిక వల్ల అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. వృత్తి, వ్యక్తిగత విషయాల గురించి షేర్ చేసుకుంటారు. అయితే హీరో దగ్గుబాటి రానా (Rana daggubati) సోషల్ మీడియాను అతి తక్కువగా ఉపయోగిస్తుంటారు. అప్పుడప్పుడూ మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని పోస్ట్లన్నీ తొలగించారు. ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటునట్లుగా ట్విట్టర్ వేదికగా రానా తెలియజేశారు. (Rana bye to instagram)
‘‘వర్క్ నడుస్తోంది. అందువల్ల సోషల్ మీడియాకు కొంతకాలం టైమ్ కేటాయించలేను. భారీ, ఉత్తమమైన, శక్తివంతమైన చిత్రాలతో మిమ్మల్ని కలుస్తాను. అమితమైన ప్రేమతో.. మీ రానా’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లన్నీ డిలీట్ చేశారు. కానీ ట్విట్టర్లో మాత్రం రానా చేసిన పోస్ట్లు అలాగే ఉన్నాయి. మరి ట్విట్టర్కు కూడా గుడ్ బై చెబుతారా అన్నది చూడాలి.
రానా హీరోగా విడుదలైన ‘విరాటపర్వం’ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆయన వెంకటేశ్తో కలిసి నెట్ఫ్లిక్స్ కోసం‘రానా నాయుడు’ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు.