రీ ఎంట్రీ ఇస్తున్న ‘రామ్ తేరీ గంగా మైలీ’ నటి

ABN , First Publish Date - 2022-04-22T00:40:04+05:30 IST

నిన్నటి తరం తారలందరూ బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ జాబితాలోకి మరో నటి చేరబోతుంది. ఆమెవరో కాదు రాజ్ కపూర్ సరసన ‘రామ్ తేరీ గంగా మైలీ’లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి మందాకిని

రీ ఎంట్రీ ఇస్తున్న ‘రామ్ తేరీ గంగా మైలీ’ నటి

నిన్నటి తరం తారలందరూ బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ జాబితాలోకి మరో నటి చేరబోతుంది. ఆమెవరో కాదు రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన ‘రామ్ తేరీ గంగా మైలీ’లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి మందాకిని. ఓ మ్యూజిక్ వీడియో ద్వారా ఆమె వెండితెర పైకి తిరిగి రంగప్రవేశం చేయనుంది. ‘మా ఓ మా’ అనే మ్యూజిక్ వీడియోలో ఆమె నటించనుంది. ఈ పాట ద్వారానే మందాకిని కొడుకు రబ్బిల్ ఠాకూర్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. మందాకిని ఏప్రిల్ చివరి వారంలో మ్యూజిక్ వీడియో షూటింగ్ మొదలుపెట్టనుంది. సాజన్ అగర్వాల్ ఈ సాంగ్‌కు లిరిక్స్‌ రాయడంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. బబ్లీ హక్, మీరా ఈ పాటకు మ్యూజిక్‌ను అందించనున్నారు. 


కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్న సందర్భంగా మందాకిని మీడియాతో ముచ్చటించింది. ‘‘నాకు సాజన్ అగర్వాల్ చాలా కాలంగా తెలుసు. అతడితో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. ‘మా ఓ మా’ అద్భుతమైన పాట. నేను వినగానే ఫిదా అయిపోయాను. నా కుమారుడు రబ్బిల్ ఈ పాటలో ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. ఏప్రిల్ చివరి వారంలో పాట షూటింగ్‌ను ప్రారంభిస్తాం’’ అని మందాకిని పేర్కొంది. కైలాశ్ రాయ్గర్ గురు ఈ పాటకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిల్మిక్లాప్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు.

Updated Date - 2022-04-22T00:40:04+05:30 IST