Gowtam Tinnanuri: రామ్ చరణ్ నో.. విజయ్ దేవర కొండ యస్..
ABN , First Publish Date - 2022-10-21T21:39:46+05:30 IST
సినీ ఇండస్ట్రీలో స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). తెలంగాణ యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’
సినీ ఇండస్ట్రీలో స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). తెలంగాణ యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి సినిమాలతో అభిమానులను అలరించాడు. తాజాగా ‘రౌడీ’ హీరో నుంచి వచ్చిన ‘లైగర్’ (Liger) బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. డిస్ట్రిబ్యూటర్స్కు భారీ నష్టాన్ని మిగిల్చింది. అందువల్ల విజయ్ హిట్ కొట్టి తిరిగి ఫామ్ను అందుకోవాలని అనుకుంటున్నాడట. దర్శకుల నుంచి వరుసగా కథలు వింటున్నాడని సమాచారం. ‘జెర్సీ’ (Jersey) ఫేం గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri)కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్నగర్లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అయితే, ఆసక్తికరమైన విషయమేమిటంటే గౌతమ్ ఇదే కథను ముందుగా ఓ స్టార్ హీరోకు వినిపించాడని తెలుస్తోంది.
గౌతమ్ తిన్ననూరి హీరో రామ్ చరణ్ (Ram Charan)తో సినిమా చేయాలి. స్క్రిఫ్ట్ను కూడా సిద్ధం చేసుకున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని ప్రచారం జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తన మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయని రామ్ చరణ్ భావించాడు. ఈ మూవీ చేయడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో గౌతమ్ తిన్ననూరి ఇదే కథను విజయ్ దేవరకొండకు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సినిమాను ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లా డిజైన్ చేస్తానని గౌతమ్ మాటిచ్చాడట. విజయ్ పూర్తి స్క్రిఫ్ట్ను సిద్ధం చేయమని కోరాడట. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ను మొదలుపెట్టాలనే ఆలోచనలో విజయ్ ఉన్నాడట. కొత్త సినిమా పట్టాలెక్కేలోపు ‘ఖుషి’ ని పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నాడని తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను మరొకరు ఒప్పుకోవడమేనది సాధారణమైన విషయమే. అప్పటి ‘ఇడియట్’ నుంచి నేటి ‘పుష్ప’ వరకు అనేక సినిమాలు ముందుగా ఒకరితో అనుకుని తర్వాత మరొకరితో తెరకెక్కినవే.