రామ్ చరణ్ వదిలిన ‘Parampara 2’ ట్రైలర్
ABN , First Publish Date - 2022-07-09T00:30:57+05:30 IST
డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ‘పరంపర’ (Parampara) సీజన్ 1 వెబ్ సిరీస్ ఎటువంటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడా వెబ్ సిరీస్కు సంబంధించి సీజన్ 2 విడుదలకు సిద్ధమైంది. ఈ వెబ్ సిరీస్లో..
డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ‘పరంపర’ (Parampara) సీజన్ 1 వెబ్ సిరీస్ ఎటువంటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడా వెబ్ సిరీస్కు సంబంధించి సీజన్ 2 విడుదలకు సిద్ధమైంది. ఈ వెబ్ సిరీస్లో జగపతి బాబు, శరత్కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్గా ఈ సిరీస్ రూపొందింది. ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోన్న.. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) విడుదల చేశారు. ‘‘ ‘పరంపర 2’ ట్రైలర్ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని ట్వీట్ చేసిన రామ్ చరణ్.. యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.
ట్రైలర్ విషయానికి వస్తే.. ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాగా ‘పరంపర 2’ వెబ్ సిరీస్ ఉండబోతోందని తెలుస్తోంది. ‘ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు’ అనే డైలాగ్తో మొదలైన ఈ ట్రైలర్.. ‘ఫ్రీడమ్ కోసం, మా నాన్న దగ్గర లాక్కున్న అధికారం కోసం, పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి’ అంటూ నవీన్ చంద్ర చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్తో మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ పాత్రల మధ్య హోరాహోరి ఘర్షణ ఆకట్టుకుంటోంది. ఓ రియల్ రివేంజ్ యాక్షన్ డ్రామా ట్రైలర్లో కనిపిస్తోంది. మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. స్ట్రాంగ్ ఎమోషన్స్తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్లో టాప్లో ట్రెండ్ అవుతోంది.