Amitabh ముందు ఆ సీన్ చేసేప్పుడు... Rakul ఎందుకు టెన్షన్ పడిందంటే...

ABN , First Publish Date - 2022-05-02T02:41:17+05:30 IST

గత కొంత కాలంగా సౌత్ సినిమాలకు దూరంగా ఉంటూ... బాలీవుడ్ లో మకాం వేసిన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ‘రన్ వే 34’ సినిమాలో కనిపించింది. అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ ఉండటంతో సినిమా పట్ల బజ్ బాగానే ఏర్పడింది. అయితే, రకుల్ సినిమా కథలో భాగంగా... బిగ్ బీతో కొన్ని సన్నివేశాల్లో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో లెటెస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా తెలియజేసింది రకుల్...

Amitabh ముందు ఆ సీన్ చేసేప్పుడు... Rakul ఎందుకు టెన్షన్ పడిందంటే...

గత కొంత కాలంగా సౌత్ సినిమాలకు దూరంగా ఉంటూ... బాలీవుడ్ లో మకాం వేసిన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ‘రన్ వే 34’ సినిమాలో కనిపించింది. అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ ఉండటంతో సినిమా పట్ల బజ్ బాగానే ఏర్పడింది. అయితే, రకుల్ సినిమా కథలో భాగంగా... బిగ్ బీతో కొన్ని సన్నివేశాల్లో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో లెటెస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా తెలియజేసింది రకుల్...


అమితాబ్ లాంటి లెజెండ్ ముందు తమ సత్తా చాటాలంటే ఎవరికైనా అది సాహసమే. ఇక సౌత్ లో దాదాపుగా అన్నీ గ్లామర్ పాత్రలే చేసిన రకుల్ హిందీలో మాత్రం పర్ఫామెన్స్ కోరుకుంటోంది. అందుకే, కథా బలమున్న చిత్రాల్లో కనిపించే ప్రయత్నం చేస్తోంది. అజయ్ దేవగణ్ నటించి, దర్శకత్వం వహించిన ‘రన్ వే 34’లో ఆమెది నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టరే. అయితే, షూటింగ్ సమయంలో అమితాబ్ తో కోర్టురూమ్ సీన్ లో నటించటం మాత్రం తనకు మోస్ట్ ఛాలెంజింగ్ అంటోంది రకుల్. కోర్టు బోనులో నిలుచున్న ఆమె ఏక కాలంలో తన ముఖంపైన మానసిక ఒత్తిడి, బేలతనం రెండూ చూపించాల్సి వచ్చిందట. అది కూడా ఎటువంటి తిరుగుబాటు ధోరణి, సంభాషణలు లేకుండా మౌనంగా హావభావాలు పలికించాల్సి వచ్చిందట! మామూలుగానే డైలాగ్స్ లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం. అటువంటిది బిగ్ బి లాంటి బిగ్ లెజెండ్ ముందు నటనతో మెప్పించటం... మరింత పెద్ద సవాలు. అయినా రకుల్ ‘రన్ వే 34’ను ఛాలెంజింగ్ గా తీసుకుని పూర్తి చేసిందట.

Updated Date - 2022-05-02T02:41:17+05:30 IST