Mr And Mrs Mahi: జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావ్ జంటగా..

ABN , First Publish Date - 2022-05-09T19:49:23+05:30 IST

బాలీవుడ్‌లో దర్శకుడు కరణ్ జోహార్‌కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. ఎన్నో హిట్ చిత్రాలు తీసిన ఈ డైరెక్టర్‌ మంచి ఫ్యాన్ బేస్‌ని..

Mr And Mrs Mahi: జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావ్ జంటగా..

బాలీవుడ్‌లో దర్శకుడు కరణ్ జోహార్‌కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. ఎన్నో హిట్ చిత్రాలు తీసిన ఈ డైరెక్టర్‌ మంచి ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకున్నాడు. కరణ్‌లో మంచి డైరెక్టర్‌తోపాటు మంచి నిర్మాత కూడా ఉన్నాడు. ‘ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions)’ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించి ఎన్నో మంచి చిత్రాలను రూపొందించాడు. ఆయన తాజాగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. గతేడాదే చిత్రబృందం ఈ సినిమాకి సంబంధించి ఎనౌన్స్‌మెంట్ చేసింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే స్టార్ అయ్యింది. ఈ విషయాన్ని ధర్మ ప్రొడక్షన్స్ మూవీటీం అఫిషీయల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రకటించింది. ఆ పోస్ట్‌కి.. ‘ఫీల్డ్ సెట్ చేశాం. ఆడటానికి మిస్టర్ అండ్ మిసెస్ మహి టీమ్ సిద్ధమైంది. మొదటి రోజు షూటింగ్ ప్రారంభం’ క్యాప్షన్ రాసుకొచ్చింది.


శరన్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అందాల తార శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్రికెటర్ అవ్వాలని కలగంటున్న అమ్మాయి, అబ్బాయికి సంబంధించిన కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీ ఎనౌన్స్ చేసినప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఈ నటీనటుల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ మూవీని అక్టోబర్ 7, 2022న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నామని అప్పట్లోనే ప్రకటించారు. దీంతో ఆ లక్ష్యంతో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.



Updated Date - 2022-05-09T19:49:23+05:30 IST