నాకు ఆయన దేవుడు: Rajendra Prasad

ABN , First Publish Date - 2022-05-28T16:34:15+05:30 IST

నేడు (మే 28) నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) శత జయంతి. ఈ సందర్భంగా ఆయనకు నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్..

నాకు ఆయన దేవుడు: Rajendra Prasad

నేడు (మే 28)  నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) శత జయంతి. ఈ సందర్భంగా ఆయనకు నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించి.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.


ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావుగారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఎన్టీఆర్‌ ద్వారానే నేను మద్రాస్ ఫిలిం స్కూల్‌లో జాయిన్ అయ్యాను. ఆయన పెట్టిన భిక్ష వల్లే ప్రఖ్యాత నటుడిగా మీ ముందు ఉన్నాను. నాకు ఆయన దేవుడు. పది మందికి సహాయం చేయండి.. అదే ఆయనకి ఘనమైన నివాళి. కొన్ని ఏళ్లు ఆయన పక్కనే ఉన్న వ్యక్తిని. సమాజమే దేవాలయం..అన్న మనిషి ఎన్టీఆర్‌. మన కళ్ళ ముందు మనం చూసిన దేవుడు ఆయన. ఈ రోజు మా పెద్దాయన బతికి ఉండి ఉంటే.. బంగారు పూలతో పాద పూజ చేసేవాడిని. అలాంటి జన్మ మళ్ళీ తెలుగు ప్రజలు ఎప్పుడు చూస్తారో. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులు మన అందరిపైన ఉంటాయి’’ అని అన్నారు.

Updated Date - 2022-05-28T16:34:15+05:30 IST