అలాంటి భావన వస్తే.. అదే నా పతనానికి నాంది: రాజమౌళి

ABN , First Publish Date - 2021-12-26T03:47:02+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం జనవరి 7వ తేదీన విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు కూడా

అలాంటి భావన వస్తే.. అదే నా పతనానికి నాంది: రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం జనవరి 7వ తేదీన విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో హై రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నారు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కొన్ని రోజులుగా బాలీవుడ్‌లోని ఏ కార్యక్రమాన్ని వదలకుండా హాజరవుతూ.. చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. కాగా, చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘ఏ స్టార్ హీరో అయినా నేను చెప్పింది చేయాల్సిందే.. అనే భావన ఎప్పుడైనా వచ్చిందా?’ అనే ప్రశ్న రాజమౌళికి ఎదురవగా.. దానికి ఆయన క్లారిటీగా సమాధానం ఇచ్చారు. 


‘‘ ‘నేనే గొప్ప.. నేను ఏం చెబితే.. అది హీరోలు చేయాలి.. నేను ఎవరు కావాలనుకుంటే వారు నా చిత్రంలో నటిస్తారు.. నాకు తిరుగేలేదు..’ అనే భావన వస్తే.. అదే నా పతనానికి నాంది అని మొదటి నుండి భావిస్తున్నాను. అలాంటి ఆలోచన నాకు లేదు.. ఇక ముందు కూడా రాదు. ఎందుకంటే నేను అలాంటి వాతావరణంలో పెరగలేదు. నాకు సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాలు తెలుసు. అన్ని దాటుకుని ఇక్కడి వరకు వచ్చిన వాడిని. సక్సెస్‌ని ఎప్పుడూ తలకి ఎక్కించుకోను..’’ అని రాజమౌళి సమాధానమిచ్చారు.

Updated Date - 2021-12-26T03:47:02+05:30 IST