తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడుంటుందో చెప్పేసిన Rajamouli..

ABN , First Publish Date - 2022-07-05T14:35:25+05:30 IST

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ (RRR). ఈ ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎంత భారీ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే.

తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడుంటుందో చెప్పేసిన Rajamouli..

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ (RRR). ఈ ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎంత భారీ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం పాన్ వరల్డ్ స్థాయిలో భారీ గుర్తింపుని సంపాదించింది. ఇక త్వరలో సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) హీరోగా తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు జక్కన్న. దుర్గ ఆర్ట్స్ పతాకంపై డా. కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. 


ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చల్లో దర్శకుడు రాజమౌళి పాల్గొంటున్నారు. ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికా నేపథ్యంలో కథ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అయితే, తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్‌లో డ్రీమ్ ప్రాజక్ట్ అయిన మహాభారతం గురించి చెప్పుకొచ్చారు. 'నిజానికి మహాభారతం (Mahabharatham) అనేది ఒక మహాసముద్రం వంటిది. అందులోకి అడుగుపెట్టేందుకు మరికొంత సమయం పడుతుంది. నాకు పురాణాలు, ఇతిహాసాలపై ఎంతో అపార గౌరవం ఉంది. 


అయితే, మహాభారతాన్ని తీయడానికి మరో మూడు, నాలుగు సినిమాల తర్వాతే సాధ్యమవుతుంది'..అని క్లారిటీ ఇచ్చారు. దీనిని బట్టి చూస్తే మొత్తంగా రాజమౌళి తన డ్రీమ్ ప్రాజక్ట్ తీయడానికి ఎంత లేదన్నా దాదాపుగా పదేళ్లు పెట్టె అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది. మరి ఆ తర్వాతైనా ఆయన నుంచి ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం వస్తుదో లేదో..చెప్పడం కాస్త కష్టమే. ఇక మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉంటుంది. 

Updated Date - 2022-07-05T14:35:25+05:30 IST