మీడియాకు ముఖం చాటేసిన శిల్పాశెట్టి భర్త.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
ABN , First Publish Date - 2022-02-25T16:54:22+05:30 IST
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకి ఫోర్నోగ్రఫీ కేసులో గతేడాది శిక్ష పడిన విషయం తెలిసిందే. కొన్ని వారాల శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్పై విడుదలైయ్యాడు...
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకి ఫోర్నోగ్రఫీ కేసులో గతేడాది శిక్ష పడిన విషయం తెలిసిందే. కొన్ని వారాల శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్పై విడుదలైయ్యాడు. అప్పటి నుంచి కూడా మీడియా నుంచి దూరం ఉంటున్నాడు. నిజానికి ఎక్కువగా బయట ఎవరి కంటపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ విషయమై చాలాసార్లు ట్రోలింగ్కి సైతం గురయ్యాడు. తాజాగా ఆ బిజినెస్మెన్ మరోసారి అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు.
తాజాగా శిల్పాశెట్టి, భర్త పిల్లలతో కలిసి ముంబైలో మీడియా కంటపడ్డాడు. ఆ సమయంలో శిల్పా, పిల్లలతో కలిసి ఫోటోలకి ఫోజులిచ్చింది. దాంతో అక్కడే ఉన్న మీడియా రాజ్తో కలిసి ఫ్యామిలీ ఫొటో ఇవ్వాలని కోరింది. దీంతో శిల్పా సైతం ఆయన్ని రమ్మని పిలించింది. అయితే అది ఇంట్రస్ట్ లేని రాజ్ అక్కడి నుంచి స్రైట్గా వెళ్లి కారులో కూర్చున్నాడు. అంతేకాకుండా ఆయన తన ముఖాన్ని బ్లాక్ మాస్క్తో కవర్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అది చూసిన నెటిజన్లు ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు.
‘అవమానంగా భావించడం వల్ల రాజ్ ముఖం చూపించడానికి ఇబ్బంది పడుతున్నాడు’ అని ఓ నెటిజన్.. ‘రాజ్ మాస్క్ చాలా ఫన్నీగా ఉంది.. కానీ అది ముఖాన్ని దాచుకోడానికి బాగా ఉపయోగపడుతుంది’ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఆ వైరల్ వీడియోని మీరు ఓ సారి చూసేయండి..