గోవా నుంచి ట్విట్టర్‌లోకి వచ్చేశానంటున్న Radhika

ABN , First Publish Date - 2021-12-16T02:26:46+05:30 IST

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌లోను సినిమాలు చేస్తు పాపులర్ అయిన నటి రాధికా శరత్ కుమార్. తాజాగా హాలీడేను ఎంజాయ్

గోవా నుంచి ట్విట్టర్‌లోకి వచ్చేశానంటున్న  Radhika

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోను సినిమాలు చేస్తూ పాపులర్ అయిన నటి రాధికా శరత్ కుమార్. తాజాగా హాలీడేను ఎంజాయ్ చేయడానికి ఆమె గోవా బీచ్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 


ట్విట్టర్ అకౌంట్‌లో రాధికా శరత్ కుమార్ ఆ ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల కింద కామెంట్ కూడా చేసింది. ‘‘ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉంది. గోవా బీచ్‌లో ఎంత దూరం నడిచానో తెలియడం లేదు ’’ అని ఆమె తెలిపింది. 


రాధికా శరత్ కుమార్ స్టార్ హీరోలైన చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్ వంటి  వారితో నటించింది. ఆమె 1978లో సినిమా కెరీర్‌ను మెదలుపెట్టింది. నేటికి కూడా తమిళ చిత్రాల్లో యాక్టివ్‌గా నటిస్తూనే ఉంది. వివిధ చిత్రాల్లో నటనకు గాను ఆమె దాదాపుగా 25అవార్డులు గెలుచుకుంది. వెండి‌తెర మీద నటించడంతో పాటు పాటు బుల్లి తెర మీద అనేక సీరియల్‌లను నిర్మించింది.  



Updated Date - 2021-12-16T02:26:46+05:30 IST