Tollywood: మొన్న రాధేశ్యామ్, నిన్న ఆచార్య, ఇవాళ SVP.. జగన్ మీమ్ వైరల్
ABN , First Publish Date - 2022-05-12T18:00:26+05:30 IST
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పిక్ చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. దీనిలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM Y S Jagan Mohan Reddy) తో పాటు టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పిక్ చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. దీనిలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM Y S Jagan Mohan Reddy) తో పాటు టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), ప్రభాస్ (Prabhas)..వారి సినిమాలు రాధే శ్యామ్ (Radhe Shyam), ఆచార్య (Acharya), తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) పోస్టర్స్ ఉండటం ఆసక్తికరంగా ఉంది. కరోనా కారణంగా అన్నీ ఇండస్ట్రీస్తో పాటు చిత్రపరిశ్రమ కూడా కుదేలయిన సంగతి తెలిసిందే. థర్డ్ వేవ్ తర్వాత మళ్ళీ చిన్న, మీడియం బడ్జెట్ సినిమాల నుంచి పాన్ ఇండియన్ సినిమాల వరకూ ఒక్కొక్కటిగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
అయితే, ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్లతో తెలుగు చిత్ర పరిశ్రమకు నష్టాలు తప్పవనే ఉద్దేశ్యంతో టాలీవుడ్ లెజండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు, దర్శకులు రాజమౌళి సహా పలువురు ఏపీ సీఎం వైఎస్ జగన్తో సమావేశమై ఇండస్ట్రీకి ఉన్న ఇబ్బందులను వివరించి టికెట్ రేట్లు పెంచేలా, అదనపు షోలను ప్రదర్శించుకునేందుకు అనుమతులను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన జగన్.. చిరంజీవి బృందం కోరిక మేరకు సినిమాలకు టికెట్ రేట్లను పెంచుకునేలా, అదనపు షోలకు అనుమతులిస్తూ కొత్త జీవోనూ జారీ చేశారు.
ఇదిలా ఉంటే..జగన్ను కలిసిన స్టార్ హీరోల సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయని..దీనిపై ఓ మీమ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్గా మారింది. లాజికల్గా చూస్తే ఇది నిజమని భావించాల్సి వస్తోంది. దీనికి కారణం, మొన్న ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్గా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల మల్టీస్టారర్ సినిమా ఆచార్య ఫ్లాప్ సినిమాల లిస్ట్లో చేరింది. ఇక మహేష్ అభిమానులందరితో పాటు కామన్ ఆడియన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన సర్కారు వారి పాట ఈరోజు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి..డివైడ్ టాక్ తెచ్చుకుంది. కొందరైతే ఫ్లాప్ సినిమాగానే దీనిని పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ను కలిసిన హీరోలకు ఫ్లాప్స్ తప్పలేదు..! అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. దీనికి సంబంధించిన మరికొన్ని కామెంట్స్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.