చాలా కొత్తగా, టెన్షన్‌గా ఉందంటోన్న Raashi Khanna

ABN , First Publish Date - 2022-01-03T00:10:44+05:30 IST

అందాల రాశి... రాశీ ఖన్నా టెన్షన్ పడుతోంది. ఆమెకంతా కొత్తగా ఉందట! దేని గురించి అంటారా?

చాలా కొత్తగా, టెన్షన్‌గా ఉందంటోన్న Raashi Khanna

అందాల రాశి... రాశీ ఖన్నా టెన్షన్ పడుతోంది. ఆమెకంతా కొత్తగా ఉందట! దేని గురించి అంటారా? రాశీ తన బాలీవుడ్ రీ ఎంట్రీ గురించి మాట్లాడుతోంది. ఆమెకు తనని హిందీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని నెర్వస్‌గా ఉందట. అసలు విషయం ఏంటంటే... కొన్నేళ్లుగా సౌత్‌లో మకాం వేసిన నార్త్ బ్యూటీ ఇప్పుడు మరోసారి బీ-టౌన్‌లో లక్ పరీక్షించుకుంటోంది. తెలుగుతో పాటూ తమిళంలో కూడా కొన్ని రోజులుగా ఫెయిర్ అండ్ క్యూట్ బేబీ హల్ చల్ కొనసాగుతోంది. విజయ్ సేతుపతి, విశాల్ లాంటి హీరోల సరసన రాశీ యాక్ట్ చేసింది. ఇక తెలుగులో కూడా మిస్ ఖన్నా బాగానే ఫ్యాన్స్‌ని పోగేసుకుంది. 


చాలా మంది ముంబై హీరోయిన్స్‌లాగే రాశీ కూడా హిందీ తెరపై అదృష్టం పరీక్షించుకోవాలని డిసైడ్ అయింది. రెండు పెద్ద ఆఫర్స్ కూడా పట్టేసింది. అజయ్ దేవగణ్ సరసన ‘రుద్ర’ అనే భారీ వెబ్ సిరీస్‌లో నటించింది. కోట్లాది రూపాయలతో నిర్మితమైన ‘రుద్ర’ త్వరలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఇక రాశీ హీరోయిన్‌గా నటిస్తోన్న మరో ప్రాజెక్ట్ ‘యోధా’. ఇది కూడా క్రేజీ మూవీనే. యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె రొమాన్స్ చేయనుంది. కరణ్ జోహర్ లాంటి బడా నిర్మాత రూపొందిస్తోన్నాడు. 


‘రుద్ర, యోధా’ ప్రాజెక్ట్స్‌తో జనం ముందుకు రాబోతోన్న రాశీ బాలీవుడ్ ఆడియన్స్ స్పందన గురించి కాస్త భయపడుతోందట. తనని ఎలా స్వీకరిస్తారోనని టెన్షన్‌గా ఉందట. అయితే, ‘‘నాకు ఇప్పుడు మరోసారి నేను కొత్తగా బాలీవుడ్‌లో కాలుమోపినట్లు అనిపిస్తోంది... విశ్వాసమైతే ఉంది కానీ ఒత్తిడి కూడా కలుగుతోంది...’’ అంటోందామె. రాశీ ఖన్నా తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ అవ్వక ముందు హిందీలోనే వెండితెర అరంగేట్రం చేసింది. ఆమె ‘మద్రాస్ కేఫ్’ లాంటి సినిమా చేశాక దక్షిణాది బాట పట్టింది. ఇప్పుడు మరోసారి బ్యాక్ టూ బాలీవుడ్ అంటోంది బబ్లీ భామ! 

Updated Date - 2022-01-03T00:10:44+05:30 IST