రూ. 250 కోట్లు: ‘పుష్ప’ ప్రీ రిలీజ్ బిజినెస్.. తగ్గేదే లే!
ABN , First Publish Date - 2021-12-12T00:07:46+05:30 IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం బిజినెస్లోనూ తగ్గేదే.. లే అనేలా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, ట్రైలర్తో సినిమాపై ఎటువంటి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం బిజినెస్లోనూ తగ్గేదే.. లే అనేలా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, ట్రైలర్తో సినిమాపై ఎటువంటి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోన్న ఈ చిత్రం ఇప్పటి వరకు తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ (ఓటిటి, డిజిటిల్ రైట్స్) కలుపుకొని రూ. 250 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లుగా తెలుస్తోంది.
‘అల వైకుంఠపురములో’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తోన్న చిత్రం, అలాగే ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ నుండి వస్తోన్న చిత్రం కావడంతో అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్ర హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లుగా సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై ట్రేడ్లోనూ భారీ క్రేజ్ ఏర్పడింది. అలాగే అల్లు అర్జున్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం కూడా కావడంతో.. ప్రమోషన్లోనూ మేకర్స్ అస్సలు తగ్గడం లేదు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.