Rashmika Mandanna: ‘రాంబో’ లో ఛాన్స్ కొట్టేసిందా..?
ABN , First Publish Date - 2022-10-01T23:50:22+05:30 IST
అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న నటి రష్మిక మందన్న(Rashmika Mandanna). ‘పుష్ప’ తో పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది.
అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న నటి రష్మిక మందన్న(Rashmika Mandanna). ‘పుష్ప’ తో పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది. ఈ చిత్రంలో శ్రీవల్లీగా కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేసింది. బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టనుంది. ‘మిషన్ ముజ్ను’ (Mission Majnu), ‘గుడ్ బై’ (Good Bye) షూటింగ్లను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ సినిమాలు విడుదల కాకముందే బాలీవుడ్లో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. రోహిత్ ధావన్ సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపికయ్యే అవకాశం ఉందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సిద్దార్థ్ ఆనంద్ ‘రాంబో’ (Rambo)ను రీమేక్ చేస్తున్నాడు. టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) హీరోగా నటిస్తున్నాడు. రోహిత్ ధావన్ (Rohit Dhawan) తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న (Rashmika Mandanna)నటించనుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. రష్మిక అయితే పాత్రకు సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట. అందువల్ల ఆమెతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. టైగర్, రష్మిక కలసి ‘స్క్రూ ఢీలా’ (Screw Dheela) లో నటించాలి. కానీ, అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆటకెక్కింది. ‘‘రోహిత్, సిద్దార్థ్ ‘రాంబో’ కోసం రష్మికతో చర్చలు జరుపుతున్నారు. ఆమె కూడా నటించడానికి ఆసక్తిగానే ఉంది. కాంట్రాక్ట్పై మాత్రం సంతకం చేయలేదు’’ అని రష్మికతో సన్నిహితంగా మెలిగేవారు తెలుపుతున్నారు. ‘రాంబో’ షూటింగ్ వచ్చే ఏడాది వేసవిలో మొదలు కానుంది. టైగర్ ‘బడే మియా, చోటే మియా’ ను పూర్తి చేయగానే ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం. ఇక రష్మిక కెరీర్ విషయానికి వస్తే.. పాన్ ఇండియా సినిమా పుష్ప-2 ఆమె చేతిలో ఉంది. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కోలీవుడ్ హీరో విజయ్తో ఆమె ‘వారసుడు’లో నటిస్తుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. బై లింగ్విల్గా ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్లో విడుదల కానుంది.