సమంత బాటలో నడవనున్న రష్మిక..?

ABN , First Publish Date - 2022-03-14T23:39:03+05:30 IST

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో

సమంత బాటలో నడవనున్న రష్మిక..?

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోను ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ కొట్టాడు. సందీప్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యానిమల్’. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేయాలంటూ నిర్మాతలు రష్మికను సంప్రదించారని తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్లు అందరూ స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. ‘పుష్ప’ చిత్రంలో సమంత ‘ఊ అంటావా మావా’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. రష్మిక కూడా సమంత బాటలోనే నడవబోతోందని సమాచారం.    


హిందీ తెరపై రష్మిక స్పెషల్ సాంగ్ మాటెలా ఉన్నా... బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వటం మాత్రం ఆల్రెడీ జరిగిపోయింది. సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’లో నటించింది. ఈ చిత్రం విడుదల కాకాముందే  ‘పుష్ప’ మూవీ పాన్ ఇండియా ఎంటర్టైనర్‌గా విడుదలై ఘనవిజయం సాధించింది. ‘పుష్ప’లో శ్రీ వల్లీగా రష్మిక హిందీ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. దీంతో ఆమెకు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘యానిమల్’ కోసం రష్మికను చిత్రబృందం సంప్రదించిదట. స్పెషల్ సాంగ్‌ చేయాలని నిర్మాతలు ఆమెతో చర్చలు జరిపారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె నిర్ణయం ఏంటో ఇంతవరకు బయటికి రాలేదు. అయితే, రష్మిక ఈ స్పెషల్ సాంగ్ చేస్తుందా లేదా తెలియాలంటే కొంతకాలం మాత్రం వేచి చూడాల్సిందే. రష్మిక నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ మధ్యనే విడుదలైంది. ప్రస్తుతం ఆమె ‘పుష్ప-2’లో నటిస్తుంది.

Updated Date - 2022-03-14T23:39:03+05:30 IST