Pushpa 2: సుక్కూకి బన్నీ ఏం చెప్పాడు..?
ABN , First Publish Date - 2022-06-09T14:16:18+05:30 IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చి పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ అందుకున్న చిత్రం ‘పుష్ప : ది రైజ్’ (Pushpa ; The Rise).
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చి పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ అందుకున్న చిత్రం ‘పుష్ప : ది రైజ్’ (Pushpa ; The Rise). రష్మిక మందన (Rashmika Mandanna) కథానాయికగా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ (Fahad Fasil) ప్రధాన విలన్గా నటించి మెప్పించిన ఈ సినిమా గతేడాది డిసెంబరులో విడుదలై.. తెలుగు, హిందీతో పాటు సౌత్లోనీ అన్నీ భాషలలో మంచి వసూళ్ళు రాబట్టింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ చిత్రం రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, పుష్ప పార్ట్ 2 ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మొదలవ్వాల్సింది. కానీ, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సాధించిన సక్సెస్తో పుష్ప 2పై గ్యారెంటీగా ఉంటాయి.
ఇదే ఒత్తిడి ఇప్పుడు దర్శకుడు సుకుమార్పైన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే, ఫిబ్రవరిలోనే మొదలుపెట్టాల్సిన షూటింగ్ ఇంకా మొదలవలేదు. సుకుమార్ మళ్ళీ స్క్రిప్ట్లో మార్పులు చేస్తున్నారట. ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్పైకి వస్తుందో తెలియడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం రోజుకో వార్త వచ్చి వైరల్ అవుతోంది.
తాజాగా కూడా ఈ సినిమాకు సంబంధించి ఇలాంటి న్యూసే వచ్చి సోషల్ మీడియాలో చల్చల్ చేస్తోంది. దీనిప్రకారం అయితే, పుష్ప సీక్వెల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచాలని బన్నీ సుకుమార్ను కోరినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకూ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి, 2023 వేసవిలో పుష్ప 2 మూవీని విడుదల చేయాలని బన్నీ భావిస్తున్నాడట. ఇదే విషయం సుక్కూకు బన్నీ చెప్పినట్టు తెలుస్తోంది. సీక్వెల్ కోసం కొంతమంది పెద్ద పేర్లను ఎంపిక చేస్తున్నారు. ఇక పుష్ప సీక్వెల్లో హీరోయిన్ రష్మిక మందన్నతో పాటు మెయిన్ రోల్స్ కూడా కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తం శెట్టి మీడియా కలిసి నిర్మించనున్నారు.