Pushpa -2: చిత్రీకరణ మొదలయ్యేది ఎక్కడంటే?
ABN , First Publish Date - 2022-09-01T21:06:39+05:30 IST
ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలిని నుంచి సినిమా షూటింగ్లకు క్లియరెన్స్ వచ్చింది. దీంతో ఒక్కో సినిమా సెట్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ‘పుష్ప–2’ చిత్రం తొలి షెడ్యూల్ ఈ వారంలో ప్రారంభం కానుంది.
ఫిల్మ్ ఛాంబర్(Film chamber), నిర్మాతల మండలి నుంచి సినిమా షూటింగ్లకు క్లియరెన్స్ వచ్చింది. దీంతో ఒక్కో సినిమా సెట్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ‘పుష్ప–2’(Pushpa-2) ఈ వారంలో ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ బ్యాంకాక్లో ప్రారంభించనున్నారు. ఈ మేరకు బన్నీ(Allu arjun), సుకుమార్ (Sukumar)టీమ్ బ్యాంకాక్కు పయనం కానుంది. అక్కడ కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్పార్ట్ చిత్రీకరణ అనంతరం టర్కీలో ఓ షెడ్యూల్ చేస్తారట. అయితే ఈ షెడ్యూల్ మొత్తం కథానుగుణంగా జపాన్లో చిత్రీకరించాలట. ఎర్రచందనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేది జపాన్కే కావడంతో అక్కడ ప్రారంభించాలనుకున్నారట. అయితే జపాన్ పోర్ట్ చిత్రీకరణకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ బ్యాంకాక్, టర్కీ ప్రాంతాల్లో ప్లాన్ చేశారని తెలిసింది. సెప్టెంబర్ మొదటివారంలో అబ్రాడ్ బయలుదేరడానికి ‘పుష్ప’ టీమ్ సిద్ధంగా ఉంది. కానీ బన్నీ ఈ వారం వెళ్తారా లేక పదో తేదీ తర్వాత వెళ్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ఈ ఏడాది సైమా అవార్డ్ వేడుకలో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకోనున్నారని తెలిసింది. ఆ వేడుక ఈ నెల 10 నుంచి 11వ తేదీ వరకూ జరగనుంది. అల్లు అర్జున్ ఆ వేడుకకు హాజరు కావలసి ఉంది కాబట్టి ఆయన కాస్త ఆలస్యంగా షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సుకుమార్ దర్శకుడు. ఫవాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రధారులు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.